హరిహర వీరమల్లు సినిమా విజయవంతం అయిన సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం లో అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసిన జనసేన నాయకులు

0
890

సికింద్రాబాద్...

 

గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్ సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జనసేన నాయకులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గబ్బర్ సింగ్ టీం,జనసేన పార్టీ నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.టిటిడి బోర్డు సభ్యుడు,జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ జనసేన అధ్యక్షులు రాదారం రాజలింగం, కూకట్పల్లి నియోజకవర్గం ఇన్చార్జి ప్రేమ్ కుమార్ లు తోటి నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వారిని ఆలయ పూజారులు ఆశీర్వదించి సన్మానించారు.తదనంరం ఆలయం ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... మా దైవం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని... హరిహర వీరమల్లు సినిమా విజయవంతమైనందుకు పవన్ కళ్యాణ్ గోత్రం, పేరుతో అర్చన చేపించి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. అతి త్వరలో పవన్ కళ్యాణ్ కూడా శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వచ్చి అమ్మవారి దీవెనలు తీసుకుంటారని చెప్పారు. కొందరు ఈ సినిమా పై విమర్శలు చేస్తున్నారని...ఒక సినిమాని సినిమా లాగానే చూడాలి గాని కొందరు పనిగట్టుకుని విమర్శిస్తున్నారని అది తగ్గదన్నారు.త్వరలో దేశంలో ఆక్టివ్ పాలిటిక్స్ లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఉంటారని ఈ సందర్భంగా వారు అన్నారు.

Search
Categories
Read More
Telangana
వర్షానికి దెబ్బతిన్న రోడ్డుకి మరమ్మతులు
26-03-2026 కిందటిసారి కురిసిన భారీ వర్షాలకు సంగాయిపల్లి మరియు చౌదర్పల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి...
By MERIGE MALLESH 2026-03-26 07:18:49 0 137
Andhra Pradesh
ACB Raids At Madanapalle DEO Office |మదనపల్లి డీఈఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో డీఈఓ కార్యాలయంలో స్కూల్ అప్గ్రేడేషన్ అనుమతుల కోసం లంచం తీసుకుంటుండగా...
By Pagadala Venkateswar 2026-01-22 06:44:00 0 148
Andhra Pradesh
డిగ్రీ బాలికల గురుకులంలో విద్యార్థి నీ విచక్షణా రహితంగా కోట్టిన వార్డెన్.
భూపాలపల్లి లోని ఎస్సీ బాలికలగురుకులంలో విద్యార్థి నీ తన రూమ్ కి పిలిపించుకొని కర్రతో ఇష్టం...
By Karapati Gopi 2025-12-31 02:08:48 0 379
Telangana
ఇరాన్ నాయకుల్లో ఎవరెవరు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు? ఇప్పుడు ఎవరెవరు సజీవంగా ఉన్నారు?
ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తరచూ చెబుతున్నారు....
By Ponnala Srinivasrao 2026-03-28 02:11:01 0 126
Telangana
బాచుపల్లి మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు
బాచుపల్లి,మల్లంపేట లో చాలా పెట్రోల్ బంకులు మూతపడుతుండటంతో వాహనదారుల్లో తీవ్ర భయాందోళనలు...
By Ponnala Srinivasrao 2026-03-25 06:08:53 0 117
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com