కార్పొరేట్ స్థాయి సేవలతో పోస్టాఫీసుల ఆధునికీకరణ

0
8

కార్పొరేట్ స్థాయి సేవలతో పోస్టాఫీసుల ఆధునికీకరణ

గ్రామాల నుంచి నగరాల వరకు ప్రజలకు మరింత చేరువగా సేవలు – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోస్టాఫీసుల ఆధునికీకరణలో భాగంగా చంద్రమౌళి నగర్‌లో నూతనంగా ఆధునికీకరించిన పోస్టాఫీస్‌ను కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు ప్రారంభించారు. అనంతరం కొమ్మినేని గార్డెన్స్‌లో నిర్వహించిన పోస్టాఫీస్ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా పోస్టల్ సేవలను డిజిటలైజేషన్, ఆధునికీకరణ దిశగా తీసుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. పోస్టాఫీసులు ఇక సంప్రదాయ ఉత్తరాల పంపిణీ కేంద్రాలుగా మాత్రమే కాకుండా, ఆధునిక సాంకేతికతతో ప్రజలకు బహుముఖ సేవలు అందించే కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో కూడా పోస్టల్ సేవలను సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకురావడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. నగరాలతో పాటు రిమోట్ గ్రామాలకు కూడా నాణ్యమైన సేవలు చేరేలా పోస్టాఫీసులను ఆధునికీకరిస్తుండడం కేంద్ర ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు.

చంద్రమౌళి నగర్ పోస్టాఫీస్ ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తోందని, ఇప్పుడు ఆధునిక సౌకర్యాలతో మరింత ప్రజానుకూలంగా మారడం స్థానికులకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు. ఒకప్పుడు దేశ ప్రజల జీవితంలో కీలకపాత్ర పోషించిన పోస్టల్ వ్యవస్థ, కాలానుగుణ మార్పులతో కొంత వెనుకబడినా, ప్రస్తుతం ఆధునికీకరణ ద్వారా మళ్లీ కార్పొరేట్ స్థాయి సేవలతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటోందని అన్నారు.

ప్రస్తుతం పోస్టాఫీసుల్లో కొరియర్ సేవలు, డిజిటల్ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అనుసంధానం, డాక్ బ్యాంకింగ్ సేవలు, పాస్‌పోర్ట్ సేవల కోసం దరఖాస్తుల స్వీకరణ వంటి అనేక సేవలను ఒకేచోట అందుబాటులోకి తీసుకువస్తున్నారని తెలిపారు.

ప్రజలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న ఆధునిక సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Telangana
భక్తి తరంగంలో ఆల్వాల్… ఘనంగా ఆంజనేయ స్వామి జయంతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ఆల్వాల్‌ లోని ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్...
By Sidhu Maroju 2026-04-02 10:56:57 0 228
Andhra Pradesh
ఆరు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు.
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ ఫేజ్ శంకుస్థాపనతో పశ్చిమ ప్రజలకు ట్రాఫిక్ భారంనుండి విముక్తి :...
By John Baji 2026-01-04 04:02:10 0 230
Telangana
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 9 వస్తువులతో కిట్లు ఇస్తామన్నా సీఎం రేవంత్ రెడ్డి ......!
విద్యార్థులకు GOOD NEWS.. 9 వస్తువులతో కిట్లు ఇస్తామన్న CM... భారత్ అవాజ్ న్యూస్: 11 మే రోజున......
By Gujile Ramu 2026-05-11 16:05:16 0 226
Andhra Pradesh
ప్రజలకు గంజాయి పై అవగాహన కల్పించిన పోలీసులు
పుంగనూరు పట్టణంల ో గంజాయ ి విక్రయిస్తూ పట్టుబడ్డ వ్యక్తులకు జిల ్ ల ా ఎస ్ స ీ తుషార ్ డూడ ి...
By Kothuru Murali 2025-12-24 04:51:07 0 218
Andhra Pradesh
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.  ...
By Gadiyapudi Narendra 2026-01-10 16:40:05 0 267
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com