ఏపీ అస్త్రం' ఆవిష్కరణ.. భవిష్యత్ పోలీసింగ్‌పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.

0
17

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థను ఆధునిక సాంకేతికతతో పటిష్ఠం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా విజయవాడ పోలీసులు రూపొందించిన 'ఏపీ అస్త్రం' మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. విజయవాడలోని అంబేడ్కర్ కళా వేదికలో మూడు రోజుల పాటు జరిగిన 'ఏపీ పోలీస్ రిట్రీట్-2026: ఫ్యూచర్ పోలీసింగ్' కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల స్వరూపం, నేరస్థుల పద్ధతులు పూర్తిగా మారిపోయాయని, ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసింగ్‌లో టెక్నాలజీ వినియోగం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. కేవలం టెక్నాలజీని అందిపుచ్చుకోవడమే కాకుండా, పోలీసు వ్యవస్థ నిర్మాణాన్నే పునః సమీక్షించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.

 

భవిష్యత్ పోలీసింగ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ లిటరసీ ఆధారంగా నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని చంద్రబాబు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. 2001లోనే తాను ఫ్యూచర్ పోలీసింగ్ వర్క్‌షాప్ నిర్వహించిన విషయాన్ని గుర్తుచేస్తూ, అప్పటితో పోలిస్తే నేడు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం, విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు పెరిగాయన్నారు. వీటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పోలీసు వ్యవస్థ పెంపొందించుకోవాలని సూచించారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడితే చర్యలు : కమిషనర్
కర్నూలు : కర్నూలు జిల్లా  కార్పొరేషన్ ఆదాయానికి గండి పడితే సహించను• నగరపాలక సంస్థ...
By Hari Krishna 2026-01-07 12:33:04 0 190
Telangana
కుషాయిగూడ, అల్వాల్ పి.హెచ్. సి.లకు క్యాన్సర్ పరీక్ష పరికరాలు మహతి ఫౌండేషన్ సహకారంతో అందించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.
  అల్వాల్ ల్లో జరిగిన ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-06-03 14:06:11 0 1K
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో "జలధార" అమలులో తీవ్ర లోపాలున్నాయని, FTL గుర్తింపు లేకుండా పనులు చేసి ప్రజాధనం వృథా చేస్తున్నారని బహుజన యువసేన EEకి వినతిపత్రమిచ్చింది.
జలధార" అమలులో లోపాలు.. ప్రజాధనం వృథా అవుతోందని బహుజన యువసేన ఆందోళన   ఇరిగేషన్ ఈఈకి...
By Pagadala Venkateswar 2026-07-22 11:28:53 0 25
Andhra Pradesh
ఉద్యోగుల వరుస మరణాలతో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.
ఉద్యోగుల వరుస మరణాలతో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం 11-04-2026 Sat 07:08 | Andhra APSRTC...
By Pagadala Venkateswar 2026-04-11 06:47:50 0 119
Telangana
"అల్వాల్‌లో అంబేద్కర్‌కు ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ గౌరవ నివాళి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఓల్డ్...
By Sidhu Maroju 2026-04-14 08:51:06 0 293
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com