నీట్ పేపర్ లీకేజీపై PDSU ఆగ్రహం విద్యాశాఖ మంత్రి రాజీనామాకు, విద్యాసంస్థల బంద్‌కు డిమాండ్

0
35

🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్, జూలై 23: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలపై Progressive Democratic Students Union (PDSU) కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే రాజీనామా చేయాలని, వరుస లీకేజీలకు కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సంస్థను తక్షణమే రద్దు చేయాలని కోరారు. దేశ రాజధానిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, మేధావులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని మండిపడ్డారు. విద్యార్థుల పక్షాన పోరాడుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను అక్రమంగా అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ అవకతవకలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ ఉన్నత విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు పెద్ద ఎత్తున సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో PDSU జిల్లా ఉపాధ్యక్షులు Sk. అయ్యూబ్ ఖాన్, ఆసిఫాబాద్ మండల అధ్యక్ష కార్యదర్శులు సమీర్, తరుణ్, సంఘం నాయకులు శివ శంకర్, శ్రీకాంత్, రిజ్వాన్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వేదక్షరి స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ విశేష స్పందన ముఖ్యఅతిథిగా జనసేన నేత జొన్న రాజేష్
*వేదాక్షరి స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ కు విశేష స్పందన*   *ముఖ్య అతిధిగా జనసేన నేత జొన్న...
By Rajini Kumari 2025-12-21 09:11:28 0 259
Andhra Pradesh
విద్యార్థుల కలలకు రెక్కలు
కలలకు రెక్కలు: నందిగామ టాపర్లకు విమానంలో హైదరాబాద్ ప్రయాణం విద్యా ప్రతిభను గౌరవించిన తంగిరాల...
By Patan Khuddus 2026-05-05 08:22:27 0 237
Andhra Pradesh
మదనపల్లెలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.
మదనపల్లి రామారావు కాలనీలో సోమవారం పట్టపగలే రెండు వర్గాల యువకులు కర్రలు, రాళ్లతో నడిరోడ్డుపై...
By Pagadala Venkateswar 2026-03-10 04:26:27 0 139
Andhra Pradesh
మదనపల్లె ఆసుపత్రిలో రోగికి నిర్లక్ష్యం.. బంధువుల ఆవేదన.
అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ సర్వ బోధన ఆసుపత్రిలో రోగిని పట్టించుకోలేదనే ఆరోపణలు గురువారం...
By Pagadala Venkateswar 2026-04-16 12:32:57 0 127
Andhra Pradesh
వాల్మీకుల హామీలు నెరవేర్చాలి: పులి శ్రీనివాసులు.
జూన్ 20న మదనపల్లె రానున్న సీఎం చంద్రబాబు నాయుడు, వాల్మీకి బోయలకు ఇచ్చిన ఎస్టీ పునరుద్ధరణ హామీని...
By Pagadala Venkateswar 2026-06-16 04:18:21 0 55
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com