ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరువైన కనీస సదుపాయాలు. ఓపీ టోకెన్ల కోసం నరకయాతన పడుతున్న రోగులు

0
129

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగుల దుస్థితి వర్ణనాతీతంగా మారింది. జిల్లావ్యాప్తంగా వణికిస్తున్న వైరల్ జ్వరాలు, సీజనల్ వ్యాధుల కారణంగా ఆసుపత్రికి వచ్చే బాధితుల సంఖ్య రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అయితే, దానికి తగ్గట్టుగా ఆసుపత్రిలో వేగంగా వైద్య సేవలు అందకపోవడంతో క్షేత్రస్థాయిలో వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కిక్కిరిసిన కౌంటర్లు. గంటల తరబడి క్యూలైన్లు.ఆసుపత్రిలోని ఓపీ టోకెన్ కౌంటర్ మరియు ల్యాబ్ విభాగాల వద్ద ఉదయం నుంచే వందలాది మంది ప్రజలు కిక్కిరిసిపోతున్నారు. ఒకవైపు విపరీతమైన జ్వరం, నీరసంతో బాధపడుతున్నప్పటికీ. ఓపీ టిక్కెట్ మరియు టోకెన్ల కోసం ఇరుకైన క్యూలైన్లలో రోగులు గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. కౌంటర్ల వద్ద కనీసం గాలి ఆడే పరిస్థితి కూడా లేకపోవడంతో చిన్న పిల్లలు, గర్భిణీలు మరియు వృద్ధులు ఆ ఉక్కపోతకు లైన్లలోనే తీవ్ర అవస్థలు పడుతున్నారు.కలెక్టర్ ఆదేశాలు కాగితాలకే పరిమితమా.ఇటీవలే జిల్లా కలెక్టర్ గారు సమీక్షా సమావేశం నిర్వహించి ఆసుపత్రిలో అన్ని రకాల మందులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని గట్టిగా ఆదేశించినప్పటికీ. ఇక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. అదనపు ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడం, ఉన్న సిబ్బందిపైనే భారం పడటంతోనే ఈ రద్దీ తీవ్రమవుతోందని బాధితులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం:వైద్యుల కొరత, విధుల్లో నిర్లక్ష్యంపై ఇటీవలే ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ధర్నాలు జరిగినప్పటికీ యాజమాన్యంలో ఆశించిన మార్పు రాలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, యుద్ధప్రాతిపదికన అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసి రోగుల ఇబ్బందులను తొలగించాలని ‘భారత్ ఆవాజ్ న్యూస్’ ద్వారా జిల్లా ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
కిష్టమ్మ ఎన్క్లేవ్ సమస్యల పరిష్కారానికి మాజీ కార్పొరేటర్ హామీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిష్టమ్మ ఎన్క్లేవ్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం మాజీ...
By Sidhu Maroju 2026-03-01 09:41:55 0 171
Andhra Pradesh
మదనపల్లె: రుషికప్రియపై అత్యాచారం – ఐద్వా నిరసన.
మదనపల్లెలో రుషికప్రియపై జరిగిన అత్యాచార ఘటన నేపథ్యంలో, రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న...
By Pagadala Venkateswar 2026-02-21 04:19:51 0 169
Telangana
ద్విచక్ర వాహనదారుల ప్రాణరక్షణే ధ్యేయంగా తిరుమలగిరిలో హెల్మెట్ బ్యాంక్ ప్రారంభం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు ఒక...
By Sidhu Maroju 2026-03-06 11:15:19 0 146
Andhra Pradesh
పెద్ద దోర్నాల మండలం రీ సర్వే గ్రామ సభ అవగాహన ర్యాలీ
పెద్ద దోర్నాల రీ సర్వే గ్రామ సభ అవగాహన కార్యక్రమం దోర్నాల సచివాలయం -1 లో నిర్వహించడం జరిగింది.......
By Chennaiah Kati 2025-12-26 06:41:41 0 423
Andhra Pradesh
విశాఖ లో లోకా యుక్త శిబిరం
ఈ నెల 29.30 తే ది ల లోకా యుక్త ఉచిత శిబిరం విశాఖలో   నిర్వ హి స్థూన్నా మ నీ  లో కా...
By Mobbu Venkatramana 2026-01-18 14:57:08 0 646
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com