హైడ్రా భూ వివాదంలో ఆర్మీ రక్షణకు హైకోర్టు ఆదేశం.|

0
26

● లోతుకుంట భూమి వివాదంలో కీలక ఆదేశాలు.

● కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై హైడ్రా కమిషనర్‌పై ఆగ్రహం.

● రేపటిలోగా 10 మంది ఆర్మీ అధికారుల పేర్లు సమర్పించాలని ఆదేశం.

మేడ్చల్ మల్కాజిగిరి , జూలై 23: మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంట సర్వే నంబర్లు 1, 2లో ఉన్న భూమి వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద భూమిలో యథాతథ స్థితిని కొనసాగించడంతో పాటు, కోర్టు ఆదేశాల అమలుకు భారత సైన్యం సహకారం తీసుకోవాలని ఆదేశించింది.

ఈ వ్యవహారంలో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ కోర్టు ఆదేశాలను వరుసగా ఉల్లంఘించారని న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 

అవసరమైతే వివాదాస్పద భూమిలోకి ఎవరైనా కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే, ఆర్మీ వారిని అదుపులోకి తీసుకునేలా కూడా ఆదేశాలు ఇవ్వగలమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

భూమి రక్షణ కోసం విధులు నిర్వహించేందుకు 10 మంది ఆర్మీ అధికారుల పేర్లను పంపించాలని ఆర్మీ అధికారుల పేర్లను పంపించాలని ఆర్మీ బ్రిగేడియర్‌కు లేఖ రాయాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై ఈ విషయంలో నమ్మకం కోల్పోయామని, అందుకే ఈ అసాధారణ చర్యలు తీసుకోవాల్సి వస్తోందని కోర్టు పేర్కొంది.

లోతుకుంటలోని ఈ భూమికి సంబంధించి ప్రభుత్వం, శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ మధ్య న్యాయ వివాదం కొనసాగుతోంది. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : పిడుగుపాటుకు వృద్ధుడు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని గొంగివారిపల్లె పంచాయతీ, పొట్టెంవారిపల్లెకు చెందిన మల్లయ్య...
By Kothuru Murali 2026-05-17 17:41:22 0 73
Uncategorized
The Sonic Shift: Evaluating Historical Protest Songs
A comprehensive academic analysis finalized this spring traces the structural evolution of...
By Dunna Jessicaruth 2026-05-19 07:26:47 0 84
Andhra Pradesh
ఇఫ్తార్ విందు ప్రాంగణంలో సామరస్యానికి ప్రతీకగా నాయకుల కలయిక
రాయచోటి రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ప్రత్యేక...
By Benguluri Madhubabu 2026-03-16 05:32:27 0 230
Telangana
గ్యాస్ సిలిండర్లపై గుడ్ న్యూస్.. రాష్ట్రాలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం, కీలక ప్రకటన
భారతదేశంలో LPG కొరత కారణంగా ప్రభుత్వం PNG వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. రాష్ట్రాలు PNG...
By Ponnala Srinivasrao 2026-03-20 12:06:37 0 201
Andhra Pradesh
సెయింట్ పీటర్స్ చర్చ్ వారికి మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు శుభాకాంక్షలు
విజయవాడ 25-12-2025   ప్రచురణార్థం   క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి...
By Rajini Kumari 2025-12-25 08:06:20 0 294
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com