కరువు రహిత దొనకొండే నా లక్ష్యం - డా గొట్టిపాటి లక్ష్మీ 

0
27

కరువు రహిత దొనకొండే నా లక్ష్యం - డా గొట్టిపాటి లక్ష్మీ 

దొనకొండ మండలంలో ‘జలధార – జలహారతి’ కార్యక్రమంలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ పి. రాజబాబు , యువనేత డ్ కడియాల లలిత్ సాగర్ గార్లతో కలిసి పలు చెరువులను సందర్శించి, రుద్రసముద్రం చెరువు పూడికతీత పనులను పరిశీలించడం జరిగింది.

గుండ్లకమ్మ మిగులు జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులకు మళ్లించడం, 40 చెరువులను అభివృద్ధి చేయడం, భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా దొనకొండలో తాగు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నాం.ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, కరువు వలసలు లేని సస్యశ్యామల దొనకొండను నిర్మించడమే మా లక్ష్యం.

చుట్టుపక్కల ఉన్న కాలువల నుంచి చెరువులను నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా చెరువుల్లోని పూడికను తొలగించి, ఆ మట్టిని తమ పొలాల్లో వినియోగించుకోవడం ద్వారా భూసారం, పంట దిగుబడిని పెంచుకోవచ్చని సూచించారు.

గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, స్థానిక టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారి విజ్ఞప్తితో దొనకొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, దొనకొండ మండల టీడీపీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, ప్రజలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉత్తరాంధ్ర జిల్లాల్లో 60 మంది టెన్త్ టాపర్లకు ప్రభుత్వ విప్ వేపాడ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం.
లోకేష్ సారథ్యంలోని 'వంద రోజుల ప్రణాళిక'తోనే అద్భుత ఫలితాలని వేపాడ వెల్లడి టెన్త్ ఉత్తీర్ణత 81.1...
By Pagadala Venkateswar 2026-05-04 06:20:20 0 99
Andhra Pradesh
పుంగనూరులో వైఎస్సార్సీపీ పోస్టర్ విడుదల
చిత్తూరు జిల్లా పుంగనూరులో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తయిన...
By Kothuru Murali 2026-06-03 15:04:51 0 72
Andhra Pradesh
చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్.
వక్ఫ్ బోర్డు చరిత్రలో తొలిసారి.  చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ...
By John Baji 2026-02-03 03:29:18 0 171
Telangana
జేజే నగర్ లో నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
అల్వాల్ డివిజన్ లోని  జేజే నగర్ కాలనీలో నూతన రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
By Sidhu Maroju 2025-07-14 12:47:11 0 1K
Telangana
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే : హైకోర్టు
 హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లపై స్టే విధించిన హైకోర్టు తెలంగాణ...
By Sidhu Maroju 2025-10-09 10:38:17 0 270
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com