నోట్లోనే పేలిన ఛార్జింగ్ లైట్ బ్యాటరీ. ఆసిఫాబాద్ జిల్లాలో పద్నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు

0
48

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఒక ఘోర ప్రమాదం ఒక పసిప్రాణాన్ని బలితీసుకుని స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చింతలమానేపల్లి మండల పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన నికోడె గణేష్, శారద దంపతుల కుమారుడైన లోకేష్ అనే పద్నాలుగేళ్ల బాలుడు ఇంట్లో ఉన్న ఒక పాత ఛార్జింగ్ లైట్ లోని బ్యాటరీని బయటకు తీసి, అది పనిచేయడం లేదనే కారణంతో తన పళ్లతో గట్టిగా కొరికాడు. బాలుడు పంటితో నొక్కిన మరుక్షణమే ఆ గట్టి ఒత్తిడికి ఛార్జింగ్ లైట్ బ్యాటరీ నోట్లోనే ఒక్కసారిగా పేలిపోయింది.ఈ భయంకరమైన ప్రమాదం వల్ల బాలుడి నోరు, గొంతు, ముఖ భాగాలు పూర్తిగా దెబ్బతిని తీవ్ర రక్తస్రావం కాగా, గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళనతో వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మార్గమధ్యంలోనే లోకేష్ ప్రాణాలు కోల్పోయాడు. చేతికందిన కొడుకు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇళ్లలో ఉండే ఎమర్జెన్సీ ఛార్జింగ్ లైట్లు, పాత ఫోన్ల బ్యాటరీల విషయంలో పిల్లలను అప్రమత్తం చేయాలని, బ్యాటరీలను నోట్లో పెట్టడం లేదా గట్టిగా నొక్కడం లాంటివి చేస్తే అవి క్షణాల్లో పేలిపోయే ప్రమాదం ఉందని చింతలమానేపల్లి మండల పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
నాపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా: ఎంపీ. ఈటెల
సికింద్రాబాద్..కాళేశ్వరం కమిషన్ విషయంలో తనపై బురద చల్లడం సరికాదని,తనపై వచ్చిన ఆరోపణలు నిజమని...
By Sidhu Maroju 2025-06-19 15:49:39 0 1K
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో చికెన్ కొంటున్నారా జాగ్రత్త
జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో 176 నుంచి 180 వరకు...
By Benguluri Madhubabu 2026-06-28 12:28:56 0 117
Andhra Pradesh
గుంటూరు జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ – 720 చలానాలు, రూ.4,74,080 /- జరిమానా; 720 మందికి రోడ్డు భద్రత అవగాహన
గుంటూరు జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ – 720 చలానాలు, రూ.4,74,080 /- జరిమానా; 720 మందికి...
By Chennaiah Kati 2026-07-10 16:25:56 0 79
Andhra Pradesh
Anna Canteen: పేదలకు శుభవార్త.. ఇక గ్రామాల్లో అన్న క్యాంటీన్లు.. సంక్రాంతి నుంచి ప్రారంభం
Anna Canteen: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో అన్న క్యాంటీన్లు...
By Siva Bhaskar 2025-12-25 02:22:39 1 754
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:01 0 40
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com