Madanapalle: మదనపల్లెలో "జలధార" అమలులో తీవ్ర లోపాలున్నాయని, FTL గుర్తింపు లేకుండా పనులు చేసి ప్రజాధనం వృథా చేస్తున్నారని బహుజన యువసేన EEకి వినతిపత్రమిచ్చింది.

0
23

జలధార" అమలులో లోపాలు.. ప్రజాధనం వృథా అవుతోందని బహుజన యువసేన ఆందోళన

 

ఇరిగేషన్ ఈఈకి వినతిపత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్

 

మదనపల్లె, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "జలధార" చెరువుల పునరుద్ధరణ పథకం క్షేత్రస్థాయిలో తీవ్ర లోపాలతో అమలవుతోందని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ ఆరోపించారు.

 

ఈ మేరకు మదనపల్లె ఇరిగేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువులు, కుంటలు, ఫీడర్ కాలువలు, సహజ నీటి ప్రవాహ మార్గాల్లో పెద్దఎత్తున అక్రమ ఆక్రమణలు కొనసాగుతున్నప్పటికీ, వాటిని తొలగించకుండా ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే తవ్వకాలు చేపడుతున్నారని విమర్శించారు.

 

రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో సంయుక్త సర్వే నిర్వహించకుండా, ఎఫ్‌టీఎల్ (FTL) సరిహద్దులను గుర్తించకుండానే పనులు చేపట్టడం వల్ల చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెరగదని, ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని పేర్కొన్నారు. మదనపల్లె డివిజన్ పరిధిలోని అన్ని చెరువులు, కుంటలు, కాలువలపై రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా వెంటనే సర్వే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Passbooks: ఏపీ రైతులకు శుభవార్త.. జనవరి 2న వీటిని ఉచితంగా తీసుకోండి!
ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సరంలో రైతులకు శుభవార్త చెబుతోంది. ఐతే.. దీని వల్ల రైతులకు కొత్తగా కలిగే...
By Siva Bhaskar 2025-12-27 03:57:17 0 600
Arunachal Pradesh
Arunachal Pradesh Boosts Governance & Tribal Welfare Drive
Arunachal Pradesh has intensified its focus on governance reforms and welfare initiatives aimed...
By Fathima Safa 2026-06-30 13:27:17 0 121
Andhra Pradesh
అమరావతిలో ప్రధాన రోడ్ల నిర్మాణం వేగవంతం
అమరావతిలో వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా విశాలమైన, ఆధునిక సౌకర్యాలతో...
By John Baji 2025-12-29 09:32:58 0 196
Media Academy
AI in Newsrooms: Revolution or Risk?
AI in Newsrooms: Revolution or Risk? Artificial Intelligence (AI) is no longer just a tech...
By Media Academy 2025-05-02 08:35:23 0 3K
Telangana
అటల్ బిహారీ వాజ్‌పేయి (25 డిసెంబర్ 1924 – 16 ఆగస్టు 2018): రాజకీయాల్లో కవిత్వం, నాయకత్వంలో మానవత్వం - Reshma Mohammed
అటల్ బిహారీ వాజ్‌పేయి కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు — రాజకీయం అంటే సేవ, ధైర్యం,...
By Reshma Mohammed 2025-12-25 16:56:43 0 998
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com