అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క. జోడేఘాట్‌లో అమరవీరుడు కొమురం భీం విగ్రహానికి ఘన నివాళులు. పలు గ్రామాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సర్‌ SSR ప్రక్రియపై క్షేత్రస్థాయి సమీక్ష.

0
60

కుమురంభీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: జల్-జంగల్-జమీన్ హక్కుల కోసం పోరాడి ప్రాణాలర్పించిన వీరుడు కొమురం భీం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పిలుపునిచ్చారు. కెరమెరి మండలంలోని జోడేఘాట్ పర్యటనకు విచ్చేసిన ఆమెకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె ఘనంగా నివాళులర్పించారు.అనంతరం జోడేఘాట్, పట్నాపూర్, బాబెఝరి, కొలాంగూడ గ్రామాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SSR) ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఓలు, బీఎల్ఓ ఇన్చార్జీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆత్రం సుగుణక్క మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి నిశితంగా సర్వే చేయాలని, అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా సవరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ల సర్వే ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి హక్కులను పరిరక్షించాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే స్పందించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీసీసీ కార్యాలయం వేదికగా మరియు క్షేత్రస్థాయిలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఇందిరా ఫెలోషిప్ జిల్లా కో-ఆర్డినేటర్ కోవ ఇందిర, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సుజాయిద్ ఖాన్, పెందోర్ రాజేశ్వర్, సాదిక్ దేస్ముఖ్, దండుగుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నడిరోడ్డుపై మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్ . ‎
ఇటీవల మణికొండలోని అల్కాపూర్ టౌన్ షిప్ లో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి...
By Ponnala Srinivasrao 2026-05-25 02:34:26 0 109
Mizoram
Mizoram Expands Governance and Digital Public Services
Mizoram continues to strengthen governance through the expansion of digital public services,...
By Fathima Safa 2026-07-01 11:04:47 0 40
Andhra Pradesh
ప్రధానిగా మోదీ రికార్డ్... చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన.
  ప్రధానిగా మోదీ రికార్డ్... చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన 10-06-2026 Wed 09:55 Andhra...
By Pagadala Venkateswar 2026-06-10 05:35:07 0 58
SURAKSHA
Architect of Modern Policing: The Inspiring Journey of IPS Alok Mittal, Director General, BPR&D
Beyond the Uniform: How Alok Mittal’s Technological Vision and Uncompromising Integrity are...
By Kalaga Sailaja 2026-07-20 05:34:58 0 23
Goa
Man Found Unconscious on Bike Near Verna Bypass; Delay in Emergency Response Sparks Concern
Man Found Unconscious on Bike Near Verna Bypass; Delay in Emergency Response Sparks Concern...
By BMA ADMIN 2025-05-21 09:40:47 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com