అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క. జోడేఘాట్‌లో అమరవీరుడు కొమురం భీం విగ్రహానికి ఘన నివాళులు. పలు గ్రామాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సర్‌ SSR ప్రక్రియపై క్షేత్రస్థాయి సమీక్ష.

0
66

కుమురంభీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: జల్-జంగల్-జమీన్ హక్కుల కోసం పోరాడి ప్రాణాలర్పించిన వీరుడు కొమురం భీం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పిలుపునిచ్చారు. కెరమెరి మండలంలోని జోడేఘాట్ పర్యటనకు విచ్చేసిన ఆమెకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె ఘనంగా నివాళులర్పించారు.అనంతరం జోడేఘాట్, పట్నాపూర్, బాబెఝరి, కొలాంగూడ గ్రామాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SSR) ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఓలు, బీఎల్ఓ ఇన్చార్జీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆత్రం సుగుణక్క మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి నిశితంగా సర్వే చేయాలని, అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా సవరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ల సర్వే ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి హక్కులను పరిరక్షించాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే స్పందించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీసీసీ కార్యాలయం వేదికగా మరియు క్షేత్రస్థాయిలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఇందిరా ఫెలోషిప్ జిల్లా కో-ఆర్డినేటర్ కోవ ఇందిర, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సుజాయిద్ ఖాన్, పెందోర్ రాజేశ్వర్, సాదిక్ దేస్ముఖ్, దండుగుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Business & Finance
TDS Returns Ensure Timely and Accurate Tax Filing
TDS Returns are essential for reporting tax deducted at source to the Income Tax Department....
By Navya Sree 2026-07-22 04:58:56 0 22
Telangana
చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి|
మంచిర్యాల జిల్లా : చెన్నూర్ లో కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ...
By Avunoori Mahesh 2026-05-07 15:02:12 0 204
Business & Finance
Tech Hiring Gains Momentum in Bengaluru IT Sector
Information technology companies in Bengaluru have stepped up hiring for roles in artificial...
By Navya Sree 2026-07-06 06:51:34 0 53
Karnataka
Karnataka Expands ‘Ganitha Ganaka’ Tutoring Scheme Statewide
Following its success in the 2024–25 pilot phase, Karnataka is expanding the Ganitha Ganaka...
By Bharat Aawaz 2025-07-17 06:45:40 0 1K
Himachal Pradesh
New Govt Move: Regulating Unregistered Social Media Firms
The government has initiated a strategic crackdown on social media platforms operating within the...
By Lokeshwari Panthadi 2026-07-01 06:11:20 0 50
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com