Madanapalle: మదనపల్లె ఎన్.జే.ఆర్ కళ్యాణమండపంలో 'షైనింగ్ స్టార్స్-2026', 'మై స్కూల్ మై ప్రైడ్' కార్యక్రమం.

0
25

Madanapalle: మదనపల్లె పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం సమీపంలోని పుంగనూరు రోడ్డులో ఉన్న ఎన్.జే.ఆర్ కళ్యాణమండపంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్–2026' మరియు 'మై స్కూల్ మై ప్రైడ్' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు రవాణా, మౌలిక వసతుల శాఖ మంత్రి, అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు రూ.20,000 ప్రోత్సాహక చెక్కులు, ప్రశంసా సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేసి అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని వారు సూచించారు.

 

రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులను ప్రోత్సహించేలా పలు సంక్షేమ, ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆటో - టిప్పరు లారీ ఢీ.. ఒకరి మృతి, 12 మందికి గాయాలు...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర...
By BABJI DADALA 2026-02-04 13:49:10 0 480
Andhra Pradesh
స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము
*స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వామ్యలు కావాలి:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
By Rajini Kumari 2026-01-12 13:18:58 0 179
Andhra Pradesh
చీమనపల్లి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి కొత్తూరు మురళి
పుంగునూరు మండలం చీమనపల్లి గ్రామ సమీపంలో గురువారం రోడ్డుపై వెళ్తున్న సుమారు 55-60 ఏళ్ల...
By Kothuru Murali 2026-06-25 17:36:32 0 100
Telangana
నిజామాబాద్: తొలిరోజు 51 మంది గర్హజారి
జిల్లాలో పధోతరగతి పరీక్షలూ ప్రశాంతాంగ ప్రారమ్భమయ్యాయ. తొలి రోజుతెలుగు పరీక్షకు-24-404 మాంధి...
By Sadaq Sadaq 2026-03-14 12:24:55 0 198
Telangana
మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.|
హైదరాబాద్ : సభలో బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సమాయత్తం కావాలి.  జిల్లాల...
By Sidhu Maroju 2025-12-29 13:02:16 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com