ఎల్లమ్మ కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు.|

0
52

- భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయం

- లక్షలాది మంది రాక నేపథ్యంలో భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి.

హైదరాబాద్, జూలై 18: ఈ నెల 21న జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం, 22న నిర్వహించే రథోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు.

అమ్మవారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత కోసం అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు.

భక్తులు దర్శనం సమయంలో తోపులాటలకు గురికాకుండా భారీ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, తాగునీరు, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని గణనీయంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

గతంలో అమ్మవారి కళ్యాణానికి సుమారు 20 వేల మంది భక్తులు హాజరయ్యేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 7 నుంచి 8 లక్షలకు చేరుకుందని చెప్పారు. వారానికి లక్ష మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారని పేర్కొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం
*For scrolls*   *అమరావతి :-*   *సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు...
By Rajini Kumari 2026-01-12 13:06:58 0 175
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం:లో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం పుంగనూరు...
By Kothuru Murali 2026-02-16 11:26:14 0 173
Telangana
"అత్యవసర సేవలకే అడ్డుగా రోడ్లు… కౌకూర్ పరిస్థితి బహిర్గతం!
మల్కాజ్ గిరి జిల్లా : మైనంపల్లి హనుమంతరావు సూచనతో, మల్కాజ్గిరి జోన్ జోనల్ కమిషనర్ సంచిత్...
By Sidhu Maroju 2026-04-09 14:06:34 0 196
Andhra Pradesh
అమరావతిలో ప్రధాన రోడ్ల నిర్మాణం వేగవంతం
అమరావతిలో వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా విశాలమైన, ఆధునిక సౌకర్యాలతో...
By John Baji 2025-12-29 09:32:58 0 195
Andhra Pradesh
గుంటూరు విద్యార్థులలో మాదకద్రవ్యాల పై అవగాహన కల్పిస్తున్న గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు. గుంటూరు రేంజ్ ఐడి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి గారు మరియు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వాకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు సంకల్ప కార్యక్రమం నీర్వహించారు.
గుంటూరు జిల్లా పోలీస్...* *30.12.2025* _*// "సంకల్పం" కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మాదక...
By KOTESWARARAO KVSR 2025-12-30 15:23:07 0 825
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com