సైన్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి: జేవీవీ రాష్ట్ర సభ్యులు షేక్ జాఫర్

0
88

భారత్ అవాజ్ | హుజూర్‌నగర్

 

విద్యార్థులు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని సైన్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలని జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర సభ్యులు షేక్ జాఫర్ అన్నారు.

 

స్థానిక తెలంగాణ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సీహెచ్ రమేష్ అధ్యక్షతన విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలపై అభిరుచి, అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేవీవీ రాష్ట్ర సభ్యులు షేక్ జాఫర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కలకుంట్ల సైదులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా షేక్ జాఫర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ చుట్టూ జరిగే ప్రతి అంశాన్ని శాస్త్రీయ కోణంలో పరిశీలించాలని సూచించారు. ఏదైనా విషయంపై దృఢమైన నిర్ణయానికి రావాలంటే పలుమార్లు పరిశీలించి, ప్రయోగాల ద్వారా రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు.

 

ప్రస్తుత సమాజ మార్పులకు అనుగుణంగా శాస్త్ర విజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోందని, భావి భారత పౌరులుగా విద్యార్థులు సైన్స్‌పై అవగాహన పెంచుకుని శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

 

అనంతరం వివిధ సులభమైన సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించి విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించారు. విద్యార్థులు ప్రయోగాలను ఆసక్తిగా వీక్షించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

 

ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

References

Love
1
Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలో జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ అమరావతి ఉత్సవాలు
*విజయవాడ..*   పున్నమి ఘాట్ సమీపంలో జనవరి 8 నుంచి 10 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న...
By Rajini Kumari 2025-12-29 09:40:56 0 174
Andhra Pradesh
Chandrababu Naidu: నా మిత్రుడు అనునిత్యం నగరి కోసం తపించేవారు: సీఎం చంద్రబాబు.
కుప్పం తరహాలో నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం హామీ 2029 నాటికి నగరికి కృష్ణా జలాలు...
By Pagadala Venkateswar 2026-01-25 06:35:41 0 154
Business & Finance
Jharkhand Promotes Industrial and Technology-Led Growth
Jharkhand continues to position itself as a destination for sustainable industrial growth by...
By Navya Sree 2026-07-04 08:13:32 0 56
Andhra Pradesh
పుంగనూరు మండలాల్లో 8 గంటలైనా తగ్గని మంచు
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో శనివారం ఉదయం 8 గంటలైనా పొగమంచు తీవ్రత తగ్గలేదు. దీనితో గ్రామాల...
By Kothuru Murali 2026-01-03 11:05:40 0 204
SURAKSHA
​. Rapid Response via 'Dial 112'
​Content: The Karnataka Police has significantly reduced response times through the 'Dial 112'...
By Kalaga Sailaja 2026-06-29 09:54:20 0 62
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com