చంద్రబాబు, నారాయణలపై సీఐడీ కేసు కొట్టేస్తూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

0
25

 

 

 

చంద్రబాబుపై సీఐడీ కేసు కొట్టేసిన హైకోర్టు

రాజకీయ ప్రత్యర్థుల కేసులపై కోర్టు ఆగ్రహం

పాలసీ నిర్ణయాలకు నేరం ఆపాదించడం తప్పని వ్యాఖ్య

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆక్షేపణ

ఫైనల్ తీర్పులో లార్డ్ డెన్నింగ్ సూత్రాలు

రాష్ట్రంలో పాలకులు మారినప్పుడల్లా పాత ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాలపై క్రిమినల్ కేసులు పెట్టే రాజకీయ సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గట్టి బ్రేక్ వేసింది. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పి.నారాయణలపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన సీఐడీ కేసును కొట్టేస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసు కేవలం రాజకీయ ప్రతీకారంతో పెట్టిందే తప్ప, ఇందులో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై.లక్ష్మణరావు స్పష్టం చేశారు.

 

చట్టాన్ని బలహీనులకు రక్షణ కవచంగా వాడాలి.. ఆయుధంగా కాదు!

ప్రముఖ అంతర్జాతీయ న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చెప్పిన ప్రసిద్ధ సూత్రాలను ఈ సందర్భంగా హైకోర్టు గుర్తుచేసింది. "చట్టం అనేది శక్తిమంతుల చేతిలో ప్రత్యర్థులను అణచివేసే ఆయుధంగా మారకూడదు.. అది కేవలం బలహీనులకు రక్షణ కవచంగా మాత్రమే ఉండాలి" అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు తమ తర్వాత వచ్చే ప్రభుత్వం కేసులతో వేధిస్తుందనే భయం లేకుండా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలని, లేనిపక్షంలో ప్రజాస్వామ్య పునాదులే కదిలిపోతాయని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం లో అన్న క్యాంటీన్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
ఆదివారం రాత్రి పుంగనూరు పట్టణంలో అన్న క్యాంటీన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి...
By Kothuru Murali 2026-02-23 12:10:00 0 141
Telangana
పిడుగు పడి 2 మేకలు మృతి
జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో సోమవారం వర్షంతో పాటు పిడుగు పడడంతో మేకలు మృతి చెందినట్లు...
By Thativar Shivaji 2026-06-29 17:38:53 0 84
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ప్లాన్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: రాబోయే...
By Chunarkar Jagadeesh 2026-06-17 16:19:48 0 184
Telangana
టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే
కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేనపై ఎన్నికల సంఘం ఆదేశాలు ‎15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ...
By Ponnala Srinivasrao 2026-07-04 16:31:00 0 120
Andhra Pradesh
Madanapalle: 'తల్లికి వందనం' పథకం విద్యార్థుల భవిష్యత్తుకు స్వర్ణయుగం లాంటిదని మదనపల్లె కూటమి నేతలు రమేష్ రెడ్డి, బాలమాలి శేఖర్ కొనియాడారు.
Madanapalle: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థుల విద్యాభివృద్ధి, పేద మరియు...
By Pagadala Venkateswar 2026-07-18 06:57:23 0 33
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com