"గోల్కొండ అమ్మవారికి బోనం ఎత్తిన ఈటల రాజేందర్".|

0
63

"బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక వేడుక: ఈటల"

హైదరాబాద్. గోల్కొండ జూలై 16: ఆషాఢ మాసం బోనాల పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు గురువారం గోల్కొండ కోటలోని శ్రీశ్రీశ్రీ జగదంబ మహంకాళి అమ్మవారిని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక సంప్రదాయం తెలంగాణ ప్రజల విశ్వాసానికి ప్రతిబింబమని పేర్కొన్నారు.

"వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి బోనాన్ని గోల్కొండ అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం లష్కర్ బోనాలతో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో బోనాలు సమర్పిస్తారు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోనూ బోనాల వేడుకలు నిర్వహిస్తారు" అని ఈటల రాజేందర్ తెలిపారు.

ప్రజలు అమ్మవారిని దర్శించుకుని కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని మొక్కుకుంటారని ఆయన అన్నారు. భూతల్లి, వ్యవసాయం, వ్యాపారాలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి తెలంగాణ పాడిపంటలతో అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటారని తెలిపారు.

తరతరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అందించడంలో గోల్కొండ బోనాల జాతర కీలక పాత్ర పోషిస్తోందని ఈటల రాజేందర్ అన్నారు. 

ప్రతి సంవత్సరం కమిటీ ఆధ్వర్యంలో కుమ్మర సోదరులు, వివిధ వర్గాల ప్రజలు కలిసి ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆయన బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అనుములు
*రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అనుమోలు...*  ************************...
By Rajini Kumari 2025-12-22 11:21:19 0 216
Tamilnadu
Supreme Court Reviews Tamil Nadu Medical Seat Transfer
The Supreme Court has agreed to examine a petition challenging the Tamil Nadu government's...
By Navya Sree 2026-06-25 13:11:09 0 80
Telangana
తెలంగాణా రాష్ట్రంలో మరో కొత్త పార్టీ
కవిత కొత్త పార్టీ పేరు ఇదే జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీని ప్రకటించారు మేడ్చల్ సభలో తన...
By MERIGE MALLESH 2026-04-25 07:27:56 0 581
Andhra Pradesh
బైక్‌పై నుంచి కిందపడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు.
చౌడేపల్లి మండలం బోయకొండ రోడ్డు మలుపు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెడుగుట్టపల్లెకు చెందిన...
By Pagadala Venkateswar 2026-03-07 09:26:12 0 185
Andhra Pradesh
జనసేనని కూటమి ప్రభుత్వం జోలికి వస్తే ఖబర్దార్
*గుంటూరు జిల్లా*   *తాడేపల్లి*   *కార్యకర్తలను అదుపులో పెట్టుకో*   *జనసేన...
By Rajini Kumari 2025-12-18 09:50:14 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com