Madanapalle: మదనపల్లె బస్టాండ్‌లో 48 గ్రాముల బంగారు నెక్లెస్ పోగొట్టుకున్న బాధితురాలు. వెంటనే స్పందించి గంటలోపే నెక్లెస్‌ను గుర్తించి అప్పగించిన 2 టౌన్ పోలీసులు.

0
29

మదనపల్లె: మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్‌లో పోగొట్టుకున్న సుమారు 48 గ్రాముల బంగారు నెక్లెస్‌ను మదనపల్లె 2 టౌన్ పోలీసులు చాకచక్యంగా గుర్తించి బాధితురాలికి అప్పగించారు. ఈ ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి తమ సమయస్ఫూర్తిని చాటుకున్నారు. సత్యసాయి జిల్లా కదిరి మండలం చౌకుపాలెంకు చెందిన ఖాదరబీ తన భర్త ఫక్రుద్దీన్‌తో కలిసి కలికిరిలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు కదిరి నుంచి బస్సులో మదనపల్లెకు చేరుకున్నారు. అనంతరం కలికిరి బస్సు కోసం ఆర్టీసీ బస్టాండ్‌లో వేచి ఉండగా, ఆమె మెడలో ఉన్న బంగారు నెక్లెస్ అనుకోకుండా పోగొట్టుకుంది. విషయం తెలుసుకున్న బాధితురాలు వెంటనే మదనపల్లె 2 టౌన్ పోలీసులను ఆశ్రయించగా, వారు వెంటనే చర్యలు చేపట్టి బస్టాండ్ పరిసరాల్లో గాలింపు నిర్వహించి, గంటలోపే 48 గ్రాముల బంగారు నెక్లెస్‌ను గుర్తించారు. అనంతరం బాధితురాలిని పిలిపించి ధృవీకరించి ఆమెకు నెక్లెస్‌ను అప్పగించారు.

 

 

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
🚩 జై శ్రీరామ్ 🚩 శ్రీ రఘునాథ ఆలయము (ఖిల్లా) ఇందూరు వద్ద ప్రతిష్ఠించబోయే 100 అడుగుల కాషాయ ధర్మ...
By Sadaq Sadaq 2026-06-11 16:13:54 0 137
Andhra Pradesh
అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం
అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి P4...
By Chennaiah Kati 2026-07-23 15:52:30 0 29
Legal
What Did the Chhattisgarh High Court Say About Virginity Tests for Women? Here's Why the Verdict Matters
What Did the Chhattisgarh High Court Say About Virginity Tests for Women? Here's Why the Verdict...
By BMA ADMIN 2025-05-21 12:28:35 0 2K
Andhra Pradesh
పల్నాడు జిల్లా ప్రజలకు క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్లతో సైబర్ మోసాలు తస్మాత్ జాగ్రత్త
పల్నాడు జిల్లా ప్రజలకు క్రిస్మస్, న్యూఇయర్ ఆఫర్లతో సైబర్ మోసాలు తస్మాత్ జాగ్రత్త..   ...
By Rajini Kumari 2025-12-17 08:27:13 0 211
Andhra Pradesh
"గోమాత" ను గౌరవిద్దాం - సామరస్యాన్ని కాపాడుదాం....!
"బక్రీద్ "రోజు ఆవుల కుర్బానీ వద్దు, మేకలు-గొర్రెలతోనే త్యాగం చేద్దాం. ముస్లిం సోదరులకు విజ్ఞప్తి_...
By Patan Khuddus 2026-05-24 19:58:08 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com