Madanapalle: ఒకే ఇంటి స్థలాన్ని పలువురికి విక్రయించి మోసానికి పాల్పడిన ముగ్గురిపై తాలూకా పోలీసులు 420 చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

0
39

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఒకే ఇంటి స్థలాన్ని పలువురికి విక్రయించి మోసానికి పాల్పడిన ముగ్గురిపై తాలూకా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని తాలూకా సీఐ కళా వెంకటరమణ సోమవారం మీడియాకు వెల్లడించారు.

 

సీఐ తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని పొన్నేటిపాలెం పంచాయతీ రామిరెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన తరిగొండ శ్రీనివాసులురెడ్డి, నారాయణరెడ్డి, ఎం. సుధాకర్‌లు పొన్నేటిపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలోని రామిరెడ్డిగారిపల్లె శివారులో సర్వే నంబర్ 360లో ఉన్న 3,300 చదరపు అడుగుల (55×60) ఇంటి స్థలాన్ని 2023లో స్థానిక నక్కలదిన్నెకు చెందిన ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ దేవేంద్రకు రూ.11.15 లక్షలకు విక్రయించారు.

 

అయితే అదే స్థలాన్ని ఇప్పటికే 2014, 2020 సంవత్సరాల్లో ఇతరులకు విక్రయించి వారి నుంచి కూడా నగదు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో బాధితుడు దేవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)కు అనుగుణంగా మోసానికి సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
రిపోర్టర్ పేరుతో అధికారులను బెదిరించిన యువకుడు.
మదనపల్లెలో సోమవారం ఉదయం ఓ యువకుడు రిపోర్టర్ పేరుతో రవాణా శాఖ అధికారులను బెదిరించిన ఘటన కలకలం...
By Pagadala Venkateswar 2026-03-16 07:05:40 0 173
Andhra Pradesh
క్యాన్సర్ రాకుండా 2300 మందికి విద్యార్థులకు ఉచిత వ్యాక్సిన్ApMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు
*క్యాన్సర్ రాకుండా 2,300 మంది విద్యార్థినిలకు ఉచిత వ్యాక్సిన్*   *మహిళ సాధికారత కోసం రోటరీ...
By Rajini Kumari 2026-01-20 11:02:00 0 162
Jammu & Kashmir
Project Hawk Eye: High-Tech Shield for Amarnath Yatra 2026
The annual Shri Amarnath Ji Yatra has received a massive technological upgrade with the...
By Lokeshwari Panthadi 2026-06-29 09:28:25 0 60
Telangana
మంచిర్యాల్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు
గంజాయి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. మంచిర్యాల్ సీఐ ప్రమోద్ రావు హెచ్చరించారు. సోమారం...
By Bonagiri RaviShankar 2026-05-19 16:57:46 0 225
Andhra Pradesh
*జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో "ఓపెన్ హౌస్" కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు*
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్ తెలిపారు. అంతర్జాతీయ...
By Vadlamudi NagaVenkat 2026-03-06 12:08:59 0 399
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com