YS Sharmila: ఏపీలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి జగన్ ప్రభుత్వమే కారణం: షర్మిల.

0
113

Andhra

 

YS Sharmila Blames Jagan Government for Rising Drug Culture in AP

జగన్ పై మరోసారి విమర్శలు గుప్పించిన షర్మిల

జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని ఆరోపణ

కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని విమర్శ

 

వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో నిర్వహించిన 'ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర'లో భాగంగా ఆమె వైసీపీ ఐదేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేయడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని ఆమె ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని, కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు. 

 

 

రాజకీయ అంశాలపైనా స్పందిస్తూ... ప్రత్యేక హోదా కోసం మోదీ కాలర్ పట్టుకుంటానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక బీజేపీకి సాగిలపడ్డారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టును కూడా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లతో అండగా ఉంటుందని, కానీ బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సభలో పాల్గొన్న పార్టీ మహిళా అధ్యక్షురాలు అమర్ జహాబేగ్ మాట్లాడుతూ, సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఎలా మేలు చేస్తారని వ్యాఖ్యానించారు.

Search
Categories
Read More
Telangana
కరీంనగర్‌లో శ్రీరామనవమి సందడి..
KARIMNAGAR 
By Sunka Santhosh 2026-03-27 08:23:19 0 215
Andhra Pradesh
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు నిప్పులు కొలిమిలా మారనున్న రాబోయే నాలుగు రోజులు : పి వో. శుభం నోక్వాల్
చింతూరు ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) శుభం నోక్వాల్ గురువారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు.వాతావరణం...
By Shyamala Yadagiri 2026-05-21 10:29:43 0 37
Rajasthan
Teenage Sensation Vaibhav Sooryavanshi Powers Royals’ Victory
Fifteen-year-old batting prodigy Vaibhav Sooryavanshi left spectators completely spellbound in...
By Dunna Jessicaruth 2026-05-20 10:15:54 0 51
Andhra Pradesh
మినీ అంగన్‌వాడీలకు పదోన్నతి: 39 మందికి ఉత్తర్వుల పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే ముత్తుముల.
కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ...
By John Baji 2026-01-03 02:11:09 0 177
Andhra Pradesh
ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేయరాదు: జిల్లా ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను చట్టపరిధిలో తక్షణమే పరిష్కరించి న్యాయం...
By Pagadala Venkateswar 2026-03-16 10:06:23 0 125
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com