Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఎస్పీ ధీరజ్ కునుబిల్లి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

0
43

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. బీసెంట్ సర్కిల్ నుంచి సంఘం ఫంక్షన్ హాల్ వరకు కాలినడకన వెళ్లి ట్రాఫిక్ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.

 

ఈ సందర్భంగా రహదారులకు ఇరువైపులా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న దుకాణాల ఆక్రమణలు, తోపుడు బండ్లను వెంటనే తొలగించుకోవాలని వ్యాపారులకు సూచించారు. పట్టణంలో ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖ చేపడుతున్న చర్యలకు ప్రజలు, వ్యాపారులు పూర్తి సహకారం అందించాలని కోరారు.

 

అలాగే వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలపకుండా, మున్సిపాలిటీ నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా రద్దీని తగ్గించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

 

ఈ తనిఖీలలో ట్రాఫిక్ సీఐ గురునాథ్, వన్‌టౌన్ సీఐ రాజారెడ్డి, ఎస్ఐ గాయత్రి, ఆర్ఎస్ఐ శ్రీనివాస్‌తో పాటు మున్సిపల్ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జులై 29న గురు పౌర్ణమి వేడుకలు.. ముమ్మరంగా ఏర్పాట్లు!
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం గుడిశవారిపల్లి సాయిబాబా ఆలయంలో జులై 29న గురు పౌర్ణమి వేడుకలను...
By Pagadala Venkateswar 2026-07-24 05:14:24 0 19
Telangana
గ్యాస్ లారీ డీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద గ్యాస్ సిలిండర్ తో వెళ్తున్న లారీ,...
By Prashanth Goindla 2026-01-02 16:05:33 0 698
Andhra Pradesh
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లాంఛనాలతో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ప్రముఖ భారతీయ సంఘసంస్కర్త కులు వ్యతిరేక ఉద్యమకారుడు మహిళా విద్యాదాత అన్నగారిన వర్గాల సమానత్వం...
By Benguluri Madhubabu 2026-04-11 06:54:26 0 153
SURAKSHA
Tamil Nadu Police: A Legacy of Technological Pioneering
The Tamil Nadu Police proudly upholds a storied legacy as a trailblazer in Indian law enforcement...
By Lokeshwari Panthadi 2026-07-03 08:58:42 0 47
Andhra Pradesh
మదనపల్లె: బొలెరో ఢీకొని తాతా–మనవరాల కు గాయాలు.
శుక్రవారం సత్యసాయి జిల్లా కొక్కంటి క్రాస్ బాలసముద్రానికి చెందిన వీరప్ప (60) తన మనవరాలు హిమశ్రీ...
By Pagadala Venkateswar 2026-03-28 04:16:07 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com