ఏజెన్సీలో ఆగని డోలిమోతలు : చింతూరు

0
105

పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో ఈరోజు ఉదయం యువతికి పాము కాటు వేయగా రోడ్డు సౌకర్యం లేక డోలీలో ప్రాథమిక ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. కూనవరం మండలం కొత్త కార్మన్ కొండ, గిరిజన గూడెం కి చెందిన సమ్మక్క ప్రియ అనే బాలిక పాము కాటుకి గురైంది వారి గిరిజన గూడెం కి రోడ్డు మార్గం లేక ఆంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను వారి కుటుంబ సభ్యులు నాలుగు కొండలు డోలితో దాటించి కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. గతంలో ఈ కొండ రెడ్లకు కొండ కింద ప్రాంతంలో ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం జీవన వసతి కల్పించడం జరిగింది. అయినప్పటికీ ఈ గిరిజన కొండ రెడ్లు వారి జీవన సౌలభ్యం, జీవనాధారం పోడు వ్యవసాయం కారణంగా మరల కొండపైకి వెళ్లడం జరిగింది. కావున ఇటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు ఆంబులెన్స్ ఇతర వైద్య సిబ్బంది వెళ్లే వెసులుబాటు లేదు కావున ప్రభుత్వం వారికి వైద్య సిబ్బందిని కేటాయించి వారి ఆరోగ్యానికి పాటుపడాలని గిరిజనులు వేడుకుంటున్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
పైడి భీమవరం నుంచి రణస్థలం రూట్ లో ఇద్దరు యువకులు 400 సిసి స్పోర్ట్స్ బైక్ అధిక వేగం నడవడం వలన...
By Mukku Ramu 2026-03-16 10:48:57 0 431
Business & Finance
Haryana Approves Major Urban Sewer Network Upgrade
Five municipal corporations in Haryana, including Gurugram, will modernize 684 kilometres of...
By Navya Sree 2026-06-30 06:01:42 0 37
Andhra Pradesh
విశాఖ లో జన తా వారిధి
విశాఖ పట్నం కలెక్టరేట్ వద్ద సోమ వారం ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు బీజేపీ నాయకులు జనతా...
By Mobbu Venkatramana 2026-01-19 13:18:07 0 624
Andhra Pradesh
APSRTC: ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు శుభవార్త.
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హాల్ టికెట్ చూపించి ఉచితంగా...
By Pagadala Venkateswar 2026-03-06 03:51:09 0 153
Andhra Pradesh
మదనపల్లి లో దినసరి మార్కెట్ టెండర్లు వాయిదా.
మదనపల్లె మున్సిపాలిటీలో 2026–27 ఏడాదికి గాను వారపు సంత, జంతు వధశాల వేలం పాటలు బుధవారం...
By Pagadala Venkateswar 2026-03-12 05:42:02 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com