రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత.|

0
72

"ఒడిశా నుంచి నాగ్‌పూర్‌కు తరలిస్తున్న రూ.20.56 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్, అదుపులో ఒక బాలుడు"

సికింద్రాబాద్, జూలై 6: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను జీఆర్‌పీ సికింద్రాబాద్, ఈగల్ టీమ్ (టీజీఎన్‌బీ), ఆర్‌పీఎఫ్ సంయుక్తంగా పట్టుకున్నాయి. శనివారం (జూలై 5) నిర్వహించిన తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు, ఒక బాలుడిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.20.56 లక్షల విలువైన 41.131 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వారిలో మహేష్ దిలీప్ వాంధరే (25), కార్తీక్ చంద్రకాంత్ అంబే (30) ఉండగా, మరో 17 ఏళ్ల బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై క్రైం నంబర్ 344/2026 కింద ఎన్డీపీఎస్ చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు.

పోలీసుల విచారణలో ఒడిశాలోని బలంగీర్‌కు చెందిన సంజు సాహు గంజాయి ప్యాకెట్లను నిందితులకు అప్పగించి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తరలించాలని ఆదేశించినట్లు వెల్లడైంది. నిందితులు దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో నాగ్‌పూర్ వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వేచి ఉండగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు వారిని పట్టుకున్నారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజు సాహు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో జీఆర్‌పీ సికింద్రాబాద్, టీజీఎన్‌బీ ఈగల్ టీమ్, ఆర్‌పీఎఫ్ అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని రైల్వే, రోడ్డు భద్రత ఐజీ కె. రమేష్ నాయుడు అభినందిస్తూ, వారి ప్రతిభకు తగిన ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
By John Baji 2026-02-04 11:32:17 0 173
Andhra Pradesh
Ajit Pawar: అజిత్ పవార్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం.. పవన్, జగన్, కేటీఆర్ సంతాపం.
Ajit Pawar: అజిత్ పవార్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం.. పవన్, జగన్, కేటీఆర్ సంతాపం...
By Pagadala Venkateswar 2026-01-28 10:32:39 0 141
SURAKSHA
Bhorkhade Hemant IAS: Championing Good Governance
A Dynamic Telangana IAS Officer Driving Inclusive Development, Efficient Governance, and...
By Lokeshwari Panthadi 2026-07-15 13:15:24 0 81
Mizoram
Mizoram Strengthens Cultural Heritage Through Preservation
Description:Mizoram continues to strengthen its cultural heritage through sustained efforts to...
By Fathima Safa 2026-07-01 10:54:58 0 38
Telangana
బొగ్గు మాయం అయ్యింది అంటే ఎవరూ సప్పుడు చేయడం లేదు...మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
భూపాలపల్లికి మేం వెళ్లి బొగ్గును చూస్తాం అంటే.. మైన్ సేఫ్టీ అంటూ మమ్మల్ని అడ్డుకున్నరు....
By Ponnala Srinivasrao 2026-06-13 05:45:04 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com