విద్యార్థులు మొబైల్ ని వీడి చదువుపై దృష్టి సారించాలి

0
382

గూడూరు జెడ్‌పీ సెకండరీ బాలికల పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం 

-  షీ టీం ఎస్‌ఐ కుమారి సునంద గారు, గూడూరు పోలీస్ స్టేషన్ SHO గిరిధర్ రెడ్డి గారితో సంయుక్తంగా విద్యార్థినులకు సైబర్ భద్రత, భరోసా సేవలు, మైనర్ డ్రైవింగ్, డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన

మహబూబాబాద్ ::గూడూరు మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాల, గూడూరులో బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమమును మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ పి శబరీష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్‌ఐ కుమారి సునంద గారు మరియు గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గిరిధర్ రెడ్డి గారు సంయుక్తంగా పాల్గొని విద్యార్థినులకు షీ టీం సేవలు, భరోసా కేంద్రం అందిస్తున్న సేవలు, వాటి ప్రాముఖ్యత, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, మత్తు పదార్థాలు మరియు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ శాఖ సేవలను వినియోగించుకోవాలని, ఏవైనా వేధింపులు లేదా నేరాలు ఎదురైన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహబూబాబాద్ షీ టీం నెంబర్8712656935, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100/112, సైబర్ మోసాల ఫిర్యాదుల కోసం1930 హెల్ప్ లైన్ నెంబర్లను వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థినులు చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాల హెడ్మాస్టర్ సుజాత మేడం, జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల హెడ్మాస్టర్ సత్యనారాయణ సార్ మరియు అధ్యాపక బృందం 300 మంది విద్యార్థిని విద్యార్థులు, షీ టీం సిబ్బంది రమేష్ ,పార్వతి, భరోసా సిబ్బంది జోష్ణ పార్వతి తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
Tirumala: తిరుమల భక్తులకు అప్‌డేట్: శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..!
  Tirumala: తిరుమల భక్తులకు అప్‌డేట్: శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..!...
By Pagadala Venkateswar 2026-02-28 08:41:21 0 286
Telangana
ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.|
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్ పాడు గ్రామ శివారులోని కాలువలో బోల్తాపడిన వేంసూరు...
By Sidhu Maroju 2026-01-02 15:15:05 0 195
Jammu & Kashmir
Forest Fire Sparks Landmine Explosions Near LoC in Poonch
Forest Fire Sparks Landmine Explosions Near LoC in Poonch A raging forest fire near the Line of...
By BMA ADMIN 2025-05-23 10:44:43 0 2K
Andhra Pradesh
పుంగనూరు: సుగాలి మిట్ట అటవీ ప్రాంతం లో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, సుగాలిమిట్ట అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం...
By Kothuru Murali 2026-01-19 12:11:57 0 170
Business & Finance
Respond to Trademark Objections with Expert Support
A trademark objection is raised by the Trademark Registry when an application requires...
By Navya Sree 2026-07-14 06:24:31 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com