సిటిఎం జనసైనికుడు దిలీప్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీ రామ రామాంజనేయులు గారు

0
89

*"CTM జనసైనికుడు దిలీప్‌పై జరిగిన దాడిని తీవ్రంగా 

 

నిన్న రాత్రి CTM ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త దిలీప్‌పై జరిగిన దాడి అత్యంత దారుణమైనదని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైన ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు గారు తెలిపారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ భిన్నాభిప్రాయాలను హింసతో అణచివేయాలని ప్రయత్నించడం అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని ఆయన పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న జనసైనికులపై ఇటువంటి దాడులు చేయడం ద్వారా వారి సేవా భావాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

 

ఈ ఘటనపై పోలీసులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరిని గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జన సైనికుడు దిలీప్‌కు పూర్తి న్యాయం జరిగే వరకు మదనపల్లి జనసేన పార్టీ శ్రేణులు అందరూ తన వెంట ఉండి పోరాటాన్ని కొనసాగిస్తారని అన్నారు. .

 

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న ప్రజాసేవా మార్గంలో నడుస్తున్న ప్రతి జనసైనికుడికి పార్టీ అండగా ఉంటుందని, ఎలాంటి బెదిరింపులు లేదా దాడులు జనసేన కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని ఆయన స్పష్టం చేశారు.

 

గాయపడిన జనసైనికుడు దిలీప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, కార్యకర్తల భద్రత కోసం అవసరమైన ప్రతి చర్యను తీసుకునేందుకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

అనంతరం మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లీట్ లు సమర్పరిచారు..

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Business & Finance
Title: Gokaldas Exports Emerges as a Top Stock Pick
Bengaluru-based garment manufacturer Gokaldas Exports has been identified as one of the top stock...
By Navya Sree 2026-06-29 05:25:10 0 42
Andhra Pradesh
షబేబరాత్ (పెద్దల పండుగ) సందర్భంగా శ్మశాన వాటికను పరిశీలించిన :నజీర్ అహ్మద్
షబేబరాత్ (పెద్దల పండుగ) సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ముస్లిం శ్మశాన వాటికల్లో...
By John Baji 2026-02-03 11:33:37 0 143
Andhra Pradesh
అంగవైకల్యం ఆత్మగౌరవానికి అడ్డుకాకూడదు.. విభిన్న ప్రతిభావంతులకు అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు
అంగవైకల్యం ఆత్మగౌరవానికి అడ్డుకాకూడదు.. విభిన్న ప్రతిభావంతులకు అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం:...
By Chennaiah Kati 2026-07-16 11:24:51 0 52
Telangana
జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిని 40 పడకలుగా అభివృద్ధి చేయాలి మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆత్రం సుగుణక్క వినతి
🎤 కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్  న్యూస్ ప్రతినిధి జగదీష్   జైనూర్ మండలం కొమురం...
By Chunarkar Jagadeesh 2026-06-12 17:40:53 0 215
Andhra Pradesh
రౌడీ షీటర్ జిల్లా బహిష్కరణ !! కర్నూలు ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా...* వడ్డే తులసి కుమార్ పై జిల్లా బహిష్కరణ ఉత్తర్వుల జారి...*...
By Hari Krishna 2025-12-27 16:18:03 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com