హైడ్రా కమిషనర్‌కు ఎమ్మెల్యే మర్రి కీలక వినతులు.|

0
59

"ప్రభుత్వ భూముల పరిరక్షణ, పేదలకు న్యాయం చేయాలని వినతి"

మేడ్చల్ మల్కాజ్ గిరి : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా అల్వాల్‌లో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన గ్రామకంఠం భూమిపై కొనసాగుతున్న కోర్టు స్టే అంశాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. 

ప్రజల భద్రత దృష్ట్యా ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అదే గ్రామకంఠం ప్రాంతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసిన అధికారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అల్వాల్ జొన్నబండ పరిధిలోని యూఎల్సీ భూములు, సర్వే నంబర్లు 582, 583లో 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. 

అదే ప్రాంతంలో నివసిస్తున్న వడ్డెర, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు జారీ అవుతున్న నోటీసుల అంశాన్ని కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, నిరుపేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మల్కాజ్‌గిరి నియోజకవర్గ ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అభివృద్ధి పనుల వేగవంతమైన అమలే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ కృషి కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే సమర్పించిన వినతులపై హైడ్రా కమిషనర్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Jammu & Kashmir
J&K Advances Border Area Development and Connectivity
Jammu & Kashmir is intensifying efforts to improve living standards in border regions through...
By Fathima Safa 2026-06-25 13:06:50 0 56
Telangana
హైదరాబాద్ మెట్రో – దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్, దేశంలో రెండవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా...
By Bharat Aawaz 2025-08-12 07:25:07 0 785
Telangana
ఈ నెల 20వ తేదీన ప్రజావాణి రద్దు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జూలై 18, 2026 మంచిర్యాల జిల్లా  :ఉట్నూర్ లోని పి.ఎం.ఆర్.సి. సమావేశ మందిరంలో ఈ నెల 20వ తేదీన...
By Avunoori Mahesh 2026-07-18 14:11:57 0 62
Andhra Pradesh
షబేబరాత్ (పెద్దల పండుగ) సందర్భంగా శ్మశాన వాటికను పరిశీలించిన :నజీర్ అహ్మద్
షబేబరాత్ (పెద్దల పండుగ) సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ముస్లిం శ్మశాన వాటికల్లో...
By John Baji 2026-02-03 11:33:37 0 143
Andhra Pradesh
బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం
బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం తో బంగ్లాదేశ్ తో భారత్ కొత్త ప్రయాణానికి బ్రేక్ పడినట్టేనా?...
By Karapati Gopi 2025-12-30 03:39:26 0 394
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com