చదువు ఇష్టం లేక, కుటుంబ కలహాలతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!

0
249

మహబూబాబాద్::: కొత్తగూడ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన పెండ్లి చందన (17) అనే ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని బుధవారం తన స్వగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చందన అమీనాబాద్‌లోని మోడల్ కాలేజీలో చదువుతోంది. వివరాల్లోకి వెళ్తే...మృతురాలి తండ్రి రాజేందర్, తల్లి దేవేంద్ర బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ నివసిస్తున్నారు. ఈ క్రమంలో చందన మహేశ్వరంలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ కాలేజీకి వెళ్లి వస్తోంది. బుధవారం ఉదయం ఎప్పటిలాగే కాలేజీకి వెళ్తానని చెప్పి బయలుదేరిన చందన.. కాలేజీకి వెళ్లకుండా నేరుగా పొగుళ్లపల్లిలోని తన సొంత గ్రామానికి వచ్చింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.

​ సూసైడ్ లెటర్ లభ్యం

ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు చందన రాసిన ఒక లేఖ (సూసైడ్ లెటర్) ఘటనా స్థలంలో లభ్యమైంది. ఆ లేఖలో.. తనకు చదువుకోవడం అస్సలు ఇష్టం లేదని, కానీ తల్లిదండ్రులు మాత్రం చదువుకోవాలంటూ తరచూ మందలిస్తున్నారని పేర్కొంది. అంతేకాకుండా, ఇంట్లో నిరంతరం జరుగుతున్న కుటుంబ కలహాల వల్ల తాను తీవ్ర మనస్థాపానికి గురయ్యానని, అందుకే ఈరోజు ఉరివేసుకుని చనిపోతున్నానని లేఖలో రాసి పెట్టింది. మృతురాలికి ఒక చిన్న చెల్లెలు ఉంది.

పోలీసుల దర్యాప్తు:

కూతురి మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తండ్రి రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తగూడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తగూడ ఎస్సై (SI) తెలిపారు.

Search
Categories
Read More
SURAKSHA
Vaibhav Saxena IPS: A Visionary Leader in Modern Policing
Vaibhav Saxena, IPS – Leading with Integrity, Innovation, and Public Service The Journey...
By Fathima Safa 2026-07-10 06:29:53 0 55
Telangana
రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని స్కూలు విద్యార్థులకు గుడ్స్యూస్. పాఠశాలలకు నేడే చివరి వర్కింగ్ డే. రేపటి...
By Mitappaly Shiavji 2026-01-09 06:56:01 0 483
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై సెక్యూరిటీ సిబ్బంది పనితీరుపై మార్పులు రావాలి
పత్రికా ప్రకటన    ఇంద్రకీలాద్రి, 06 జనవరి 2026   సెక్యూరిటీ సిబ్బంది పనితీరులో...
By Rajini Kumari 2026-01-06 11:01:57 0 218
Andhra Pradesh
మదనపల్లిలో మలుపు గ్రంథఆవిష్కరణ
మదనపల్లె ప్రశాంత్ నగర్ జ్ఞానోదయ పాఠశాలలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ కామకోటి లక్ష్మీ రాఘవ రచించిన 11వ...
By Pagadala Venkateswar 2026-05-25 04:30:06 0 91
Andhra Pradesh
మైనార్టీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
రంజాన్ పండగ పురస్కరించుకొని రాయిచోటి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కలిసిన పలువురు...
By Benguluri Madhubabu 2026-03-21 07:48:47 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com