వేగంగా ఎస్ఐఆర్
ప్రతీ ఒక్కరూ SIR లో వివరాలు నమోదు చేసుకోవాలి
జిల్లా ఎన్నికల అధికారి స్నేహ శబరీష్
మహబూబాబాద్ :ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ డోర్నకల్ నియోజకవర్గంలో 78 శాతం, మహబూబాబాద్ నియోజకవర్గంలో 78 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
మరో రెండు రోజుల్లో రెండు నియోజకవర్గాల్లో వంద శాతం ఫారాల పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు.ఫారాల పంపిణీ అనంతరం రెండో విడత బూత్ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేస్తామని, అన్ని బీఎల్ఓలు ఫారం-6 డిక్లరేషన్తో ఇంటింటికీ వెళ్తున్నారని, ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నమ్మారు,
ఈ "ఎస్ ఐ ఆర్" సవరణ కార్యక్రమంలో డోర్నకల్ 267, మహబూబాబాద్ 288, మొత్తం 555 బిఎల్ఓ లు, సూపర్వైజర్స్ 56, ఏఈఆర్ఓ లు 12 మంది, ఈ ఆర్ ఓ లు 2 మంది, జిల్లా వ్యాప్తంగా వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయుటకు చర్యలు తీసుకున్నామని, సర్వే కు వెళ్లే ముందు సిబ్బంది ఐడి కార్డు, క్యాప్, మెటీరియల్ తీసుకుని సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఆన్లైన్ లో ఎన్యూమరేషన్ ఫాం ఫిల్ చేయుటకు మరియు 2002 జాబితాలో పేరు కొరకు voters.eci.gov.in ని సంప్రదహించలని లేదా ECINET app డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అని తెలిపారు ఎస్ ఐ ఆర్ సవరణ ప్రక్రియ కార్యక్రమంలో ఎలా సందేశాలు వచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ 1950 సంప్రదించాలనీ కలెక్టర్ కోరారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz