'నరేంద్ర విజయం' పుస్తకావిష్కరణ.|

0
188

"11 ఏళ్ల మోదీ పాలనపై సంకలన గ్రంథం విడుదల"

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ గత 11 ఏళ్ల పాలనలో అమలు చేసిన ప్రజాహిత కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ విధానాలపై రూపొందించిన 'నరేంద్ర విజయం' పుస్తకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మంగళవారం ఆవిష్కరించారు.

ఈ పుస్తకాన్ని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు గీతా మూర్తి సంకలనం చేయగా, దేశంలోని వివిధ రంగాలకు చెందిన దాదాపు 25 మంది ప్రముఖుల వ్యాసాలను ఇందులో పొందుపరిచారు.

ఈ సందర్భంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ, ఇలాంటి పుస్తకాల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేసిన ప్రజాహిత కార్యక్రమాలు, దేశాభివృద్ధికి తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రజలకు మరింత విస్తృతంగా చేరుతాయని అన్నారు. ఈ గ్రంథం రూపకల్పనలో గీతా మూర్తి చేసిన కృషిని ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
బ్యాటరీ దొంగలను అరెస్టు చేసిన పోలీసులు ::
కర్నూలు సిటీ :కర్నూలు జిల్లా...ఇద్దరు నిందితులు అరెస్టు.దొంగలించబడిన 11 బ్యాటరీలు...
By Hari Krishna 2026-01-18 11:40:21 0 181
Andhra Pradesh
హనుమాన్ సుందరకాండ పారాయణం లో పాల్గొన్న ఎమ్మెల్యే
కర్నూలు : నంద్యాల : డోన్ :  డోన్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆరోగ్యవంతంగా, శాంతి...
By Hari Krishna 2026-01-05 23:57:36 0 220
Andhra Pradesh
Chandrababu Naidu: ఆయన బెంగళూరులో ఉంటే అదే రాజధాని అవుతుందా?: సీఎం చంద్రబాబు
      Chandrababu Naidu: ఆయన బెంగళూరులో ఉంటే అదే రాజధాని అవుతుందా?: సీఎం...
By Pagadala Venkateswar 2026-01-18 10:30:55 0 338
Telangana
మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 
భారత్ అవాజ్  మద్దూర్ మండల్ రిపోర్టర్    సూర్యమోహన్    మద్దూరు...
By Vanmoj Suryamohan 2026-03-23 12:33:07 0 357
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాకు ఎనిమిదవ స్థానం.
సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసిన ఓపెన్ స్కూల్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా పదిలో 8వ స్థానం,...
By Pagadala Venkateswar 2026-05-02 03:59:47 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com