రహదారి భద్రతే లక్ష్యం... నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

0
60

రహదారి భద్రతే లక్ష్యం... నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన అధిక వెలుతురు (హై ఇంటెన్సిటీ) ఎల్‌ఈడీ లైట్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాహనాలకు అమర్చిన అనధికారిక ఎల్‌ఈడీ లైట్లను తొలగించి, సంబంధిత వాహనదారులకు మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇటువంటి అధిక వెలుతురు లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగించి రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని పోలీసులు వివరించారు.

ప్రజలు తమ వాహనాల్లో అనుమతించబడిన ప్రమాణాల ప్రకారం మాత్రమే లైట్లను వినియోగించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితమైన రహదారి వాతావరణాన్ని కల్పించడంలో పోలీసులకు సహకరించాలని ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు

Search
Categories
Read More
Telangana
హిందీ పరీక్షకు 100% హాజరు
రామయంపేట మండలంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని తహసిల్దార్...
By Katiyala JeevanRaj 2026-03-18 11:03:46 0 725
Andhra Pradesh
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి: డీఈవో.
జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని మదనపల్లిలోని బాలాజీ నగర్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్...
By Pagadala Venkateswar 2026-02-28 11:34:40 0 166
Andhra Pradesh
వాట్సాప్ ద్వారా సేవలు : కర్నూలు డిఐజీ
కర్నూలు :కర్నూలు జిల్లా...వాట్సాప్ గవర్నెన్స్  ‘మన మిత్ర’లో  FIR...
By Hari Krishna 2026-01-06 00:04:49 0 231
Andhra Pradesh
ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్‌కు మూడేళ్ల జైలు శిక్ష.
మదనపల్లెలో 2018లో జరిగిన ట్రాక్టర్ బోల్తా ఘటనలో ఇద్దరు కూలీల మృతికి కారణమైన ట్రాక్టర్...
By Pagadala Venkateswar 2026-04-25 04:41:08 0 97
Telangana
కాల్వ, నీటి పనుల వేగంపై శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు.|
హైదరాబాద్‌: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి,...
By Sidhu Maroju 2026-03-30 12:15:48 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com