జేబీఎస్ వేదికగా యాంటీ డ్రగ్ సందేశం.|

0
86

"జేబీఎస్‌లో పోలీసుల వినూత్న కార్యక్రమం.. భారీగా పాల్గొన్న ప్రజలు"

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ (JBS)లో డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, సాధారణ ప్రజలు పాల్గొని మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి తమ మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమానికి  మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, బేగంపేట్ ఏసీపీ గోపాలకృష్ణ హాజరై మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. యువతతో పాటు ప్రతి పౌరుడు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, సమాజాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. 

అనంతరం డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు జూబ్లీ బస్ స్టేషన్ పరిసరాల్లో అవగాహన ర్యాలీ చేపట్టారు. 

ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మాదకద్రవ్యాలపై పోరాటంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అధికారులు పేర్కొనగా, ఈ కార్యక్రమాన్ని మారేడ్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ వెంకటేష్ సమన్వయం చేశారు.

–Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:కొలింపల్లి గ్రామం వద్ద కుక్కల గుంపు దాడిలో జింక మృతి
పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం, దిగువపల్లి పంచాయతీ, కోలింపల్లి గ్రామ సమీపంలో ఆదివారం...
By Kothuru Murali 2026-02-15 07:30:26 0 154
Andhra Pradesh
పుంగనూరులో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
పుంగనూరు పట్టణంలోని నానాసాహెబ్‌పేటకు చెందిన బాబా కుమారుడు అహ్మద్ భాషా (46) ఆటో డ్రైవర్ గా...
By Kothuru Murali 2026-06-24 17:10:47 0 75
Andhra Pradesh
వాహనదారులకు రక్షణ
విజయవాడ సెంట్రల్రో బిఆర్టిఎస్ డ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనాల కోసం ఏర్పాటు చేసిన పోలీసులు
By Kokkiligadda Suresh 2026-04-28 14:46:04 0 242
Andhra Pradesh
విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలో జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ అమరావతి ఉత్సవాలు
*విజయవాడ..*   పున్నమి ఘాట్ సమీపంలో జనవరి 8 నుంచి 10 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న...
By Rajini Kumari 2025-12-29 09:40:56 0 178
Andhra Pradesh
సరస్ – అఖిల భారత డ్వాక్రా బజార్ సందర్శనకు విచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన నేపథ్యంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు.
📍 నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన సరస్ – అఖిల భారత...
By John Baji 2026-01-06 12:44:35 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com