ఈటెల ఏమన్నారంటే..!

0
61

"రంగారెడ్డి నగర్‌లో శివాజీ విగ్రహావిష్కరణలో ఎంపీ ఈటెల రాజేందర్.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని పిలుపు"

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రంగారెడ్డి నగర్‌లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించారు.

భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురువుగా నిలిచిందని, ఆ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. 

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయడంలో మోదీ కీలక పాత్ర పోషించారని అన్నారు.

ఛత్రపతి శివాజీ భారతమాత ముద్దుబిడ్డ అని, ఆయన ధైర్యసాహసాలు, దేశభక్తి, కట్టుబాటు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు. అన్ని మతాలను సమానంగా గౌరవించిన మానవతావాదిగా శివాజీ చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. 

ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఆలయాల పరిరక్షణకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఇతిహాసాలు, మానవ సంబంధాలు ప్రపంచం ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతాయని ఈటల అన్నారు. భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని గుర్తించిన అనేక దేశాలు ఇప్పుడు భారత్‌ను అనుసరిస్తున్నాయని, ప్రపంచానికి భారతదేశం మార్గదర్శిగా నిలిచే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.

రంగారెడ్డి నగర్‌లో స్థానికులు ఎదుర్కొంటున్న రోడ్ల సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. గత 12 సంవత్సరాలుగా మోదీ పాలనను చూసిన అనంతరం దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు భారతీయ జనతా పార్టీ పాలనను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. 

తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే, గత వైభవాన్ని తిరిగి సాధించాలంటే రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. 

ఈకార్యక్రమంలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ యాదవ్, బాచుపల్లి కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, వినాయక్‌నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి భరత్ సింహారెడ్డి, గాజులరామారం కార్పొరేటర్ శేషగిరిరావు, సీనియర్ నాయకులు నంద నందివాకర్, కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు భానుక నర్మద మల్లికార్జున్, కంటోన్మెంట్ వైస్ ప్రెసిడెంట్ బి.ఎన్. శ్రీనివాస్, రంగారెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు మణికంఠతో పాటు పలువురు బీజేపీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
చెమటలో చరిత్ర రాసి మే డే సందర్భంగా రాసిన పాట ఎస్సీ ఎస్టీ జనరల్ సెక్రటరీ గంగారం లింగమూర్తి ఆధ్వర్యంలో ఆవిష్కరణ
స్థానిక పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని 16:30 / 1982 ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో...
By Pinnehasan Odela 2026-04-30 16:31:02 0 462
Manipur
Kamjong Conflict: Border Tension and Arson Reported
A disturbing resurgence of violence has gripped the Kamjong district along the India-Myanmar...
By Lokeshwari Panthadi 2026-07-02 05:41:52 0 40
Business & Finance
Bengaluru Office Leasing Demand Remains Strong
Bengaluru's commercial real estate market continues to record strong office leasing activity,...
By Navya Sree 2026-07-06 06:45:40 0 53
Uttarkhand
Guest Teachers Threaten Election Boycott Over Unpaid Wages
Guest teachers in Uttarakhand—many serving for over eight years—are protesting unpaid...
By Bharat Aawaz 2025-07-17 07:31:56 0 2K
SURAKSHA
Administrative Mastery: The Journey of Dr. Saket Kumar, IAS
Administrative Excellence: Inside Dr. Saket Kumar’s Journey: "Effective governance is...
By Kalaga Sailaja 2026-07-21 06:44:19 0 30
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com