అధ్యాపక పోస్టుల భర్తీ వేగవంతం చేయండి: అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం.

0
52

 

అధ్యాపక పోస్టుల భర్తీ వేగవంతం చేయండి: అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం

 

Andhra

నిరుద్యోగుల కోసం జూలైలో 'నైపుణ్యం' పోర్టల్ ఆవిష్కరణ

అన్ని ప్రభుత్వ ఐటీఐలలో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు

ప్రతి మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు

ఓంక్యాప్ ద్వారా వచ్చే నెలలో 146 మందికి విదేశీ ఉద్యోగాలు

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టులకు గాను ఇప్పటివరకు 1,89,316 దరఖాస్తులు వచ్చాయని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు.

 

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును డేటా ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. విశ్వవిద్యాలయాన్ని యూనిట్‌గా తీసుకుని నియామకాలు చేపడుతున్నందున, ఎంపిక కమిటీలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ఈ నియామక ప్రక్రియను ముగించాలని ఆదేశించారు. స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించి పరిశ్రమలతో తప్పనిసరిగా ఒప్పందాలు ఉండాలని, దీని కోసం రూపొందించే చట్టం దేశానికే ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.

 

నిరుద్యోగ యువత కోసం రూపొందించిన 'నైపుణ్యం' పోర్టల్‌ను వచ్చే నెలలో ఆవిష్కరించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. దీని ద్వారా నమోదైన ప్రతి ఒక్కరికీ ఆన్‌లైన్ స్కిల్ కార్డు జారీ చేస్తామని వెల్లడించారు. పీఎం సేతు పథకం కింద మంజూరైన క్లస్టర్లలో ఐటీఐలను బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని ప్రభుత్వ ఐటీఐలలో ఏఐ ల్యాబ్స్‌లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

 

ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కార్పొరేషన్ (ఓంక్యాప్) ఆధ్వర్యంలో వచ్చే నెలలో 146 మందికి విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1,30,422 మందికి ఉద్యోగాలు లభించాయని, ఇకపై ప్రతి త్రైమాసికానికి నియోజకవర్గ కేంద్రాల్లో జాబ్ మేళాలు నిర్వహించాలని లోకేష్ ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్త, స్కిల్ డెవలప్‌మెంట్ ఎండీ గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
దొంతిరి కార్తీక్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ రామ్ లీలా మైదానంలో దొంతిరి కార్తీక్...
By Sidhu Maroju 2025-12-07 15:17:59 0 283
Andhra Pradesh
కోటప్పకొండ కొత్తపాలెం రోడ్లను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
*కోటప్పకొండ - కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు*  ...
By Rajini Kumari 2026-01-22 12:08:31 0 183
Andhra Pradesh
బొబ్బిలిలో ఈనెల 31న మెగా జాబ్ మేళా
బొబ్బిలిలో గల స్థానిక శ్రీ సాయి (SS) డిగ్రీ కాలేజీలో ఈనెల 31న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు...
By Boiena Rajesh 2026-03-29 04:15:42 0 221
Goa
South Goa Traffic Signals Spark Congestion Concerns
Motorists in South Goa have raised concerns over newly activated traffic signals, stating that...
By Navya Sree 2026-06-25 08:55:38 0 72
Bharat Aawaz
Article 8 – Citizenship for Indians Living Abroad “Indian by origin. Citizen by choice.”
What is Article 8 All About? Article 8 of the Indian Constitution offers citizenship rights to...
By Bharat Aawaz 2025-07-02 06:05:28 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com