రూ.55 లక్షలతో 8 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.|

0
84

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 278వ డివిజన్ గాజులరామారం పరిధిలోని శ్రీరాంనగర్-బి, ఎమ్‌ఎఫ్ ఫంక్షనల్ హాల్ ప్రాంతంలో రూ.55 లక్షల వ్యయంతో చేపట్టనున్న 8 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.

ఆ ప్రాంతంలోని రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన కొలన్ హన్మంత్ రెడ్డి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిధుల ద్వారా రూ.55 లక్షలు మంజూరు చేయించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే తమ లక్ష్యమని, నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.

అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేసిన కాలనీ వాసులు కొలన్ హన్మంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి లాయక్, బోయిని వెంకటేష్, శ్రీధర్ వర్మ, సతీష్ బాబు, మాయిన్ భాయ్, కాలనీ అధ్యక్షుడు మస్జీద్ భాయ్, హరీష్, ఆఫ్జాల్, శ్రీనివాస్ రావు, రహీమ్, ఖలీమ్, అజయ్, పాషా తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో సారా కేసు – నిందితుడిపై పీడీ యాక్ట్.
మదనపల్లెలోని బుగ్గకాల్వ ప్రాంతానికి చెందిన మూడే బాలాజి నాయక్ (32)పై నాటుసారా కేసుల్లో పీడీ యాక్ట్...
By Pagadala Venkateswar 2026-04-03 05:44:08 0 163
Andhra Pradesh
మదనపల్లి: ప్రభుత్వ ప్రణాళికలకు జనగణనే ప్రాతిపదిక: కలెక్టర్.
ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు ఖచ్చితమైన జనగణన గణాంకాలే బలమైన పునాది అని...
By Pagadala Venkateswar 2026-02-28 06:28:14 0 136
Chandigarh
Special Revision of Electoral Rolls Commences Across Manipur
The Election Commission of India officially launched Phase III of the Special Intensive Revision...
By Dunna Jessicaruth 2026-05-20 09:38:51 0 179
Telangana
న్యూ ఇయర్ వేళ "జీరో డ్రగ్స్" లక్ష్యం -CP. సజ్జనర్ IPS.|
నిబంధనలు ఉల్లంఘిస్తే పబ్ లు, హోటళ్ల లైసెన్సులు రద్దు. హైదరాబాద్ సీపీ సజ్జనర్‌ హెచ్చరిక....
By Sidhu Maroju 2025-12-26 21:07:43 0 264
Andhra Pradesh
బోయకొండలో రహస్య కోడిపందెం; 13 మందిని అరెస్ట్.
అన్నమయ్య జిల్లా బోయకొండ పరిసరాల్లోని వీకే రెసిడెన్సీ వెనుక రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందెంపై...
By Pagadala Venkateswar 2026-02-06 04:32:01 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com