గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ డిమాండ్

0
120

🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత ఆవాజ్ న్యూస్   ప్రతినిధి జగదీష్ 

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నూతన విద్యా సంవత్సరం 2026-27 ప్రారంభమైన నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గిరిజన శాఖ అభివృద్ధి జిల్లా అధికారి రమాదేవి గారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అనేక ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో కనీస సౌకర్యాల లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు విషజ్వరాలు, సీజనల్ వ్యాధులు సోకకుండా అన్ని పాఠశాలలు, హాస్టళ్లలో క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. అదేవిధంగా జిల్లాలోని కొన్ని ఆశ్రమ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వర్షాల కారణంగా విద్యార్థుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టి సురక్షితమైన వాతావరణంలో విద్యను అందించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని పాఠశాలలు, హాస్టళ్లలో తాగునీరు మరియు విద్యుత్ సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అన్ని విద్యాసంస్థల్లో నిరంతర తాగునీరు, విద్యుత్ సరఫరా కల్పించాలని కోరారు. అలాగే జిల్లాలో నిర్మాణంలో ఉన్న గిరిజన ప్రాథమిక పాఠశాల భవనాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని దుర్గం దినకర్ విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Business & Finance
Heavy Rains Disrupt Business Activity Across Mumbai
Heavy monsoon rains have disrupted normal business activity across Mumbai, causing waterlogging,...
By Navya Sree 2026-07-06 05:12:05 0 41
Telangana
నిజామాబాద్ : చిత్తశుద్ధితో పనిచేయాలి
ప్రభుత్వం ప్రతిష్టా ఆత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి విజయవంతానికి చిత్తశుద్దితో క్రుషి...
By Sadaq Sadaq 2026-03-04 16:28:00 1 207
Andhra Pradesh
వ్యవసాయ కరెంట్ ట్రాన్స్ఫారం దొంగతనం
చీరాల మండలం పిట్టువారి పాలెం – గవినివారి పాలెం మధ్య ఉన్న వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా...
By Vadlamudi NagaVenkat 2026-07-02 09:11:46 0 90
Uttarkhand
Uttarakhand Boosts Tourism Infrastructure for Growth
Uttarakhand continues to strengthen its tourism infrastructure through improved road...
By Fathima Safa 2026-06-27 06:41:28 0 40
Himachal Pradesh
Himachal Pradesh Boosts Sports Development in 2026
Himachal Pradesh is strengthening its sports ecosystem through improved infrastructure, athlete...
By Fathima Safa 2026-07-02 08:55:32 0 65
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com