సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు.
X
సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు
25-06-2026 Thu
Andhra
CI Nagaraju shifted to Rajahmundry jail in Sai Krishna disappearance case
విజయవాడ కస్టడీ డెత్ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్
నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
గాదె సాయి కృష్ణ మృతి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం
ఆధారాలు తారుమారు చేశారనే ఆరోపణలపై విచారణ
ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన విజయవాడ కస్టడీ మరణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సస్పెండైన కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) ఎస్.ఎస్.వి.వి. నాగరాజుకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అధికారులు నిన్న ఆయనను భారీ భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
మంగళవారం సుమారు ఐదు గంటల పాటు విచారించిన అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నాగరాజును అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, జులై 8 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, పోలీసులు మూడు ప్రత్యేక వాహనాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య నాగరాజును విజయవాడ నుంచి రాజమండ్రికి తరలించారు.
గాదె సాయికృష్ణ (25) అనే యువకుడి అదృశ్యం, కస్టడీ మరణం కేసులో సీఐ నాగరాజు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మే 9న మార్కాపురం నుంచి సాయికృష్ణను అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారని, అక్కడ చిత్రహింసలకు గురిచేయడం వల్లే అతను మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాయికృష్ణ మరణానంతరం ఆధారాలు మాయం చేసేందుకు సీసీటీవీ ఫుటేజీని తొలగించి, మృతదేహాన్ని విద్యుత్ శ్మశానవాటికలో దహనం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఐజీ ఎం. రవిప్రకాశ్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో ‘సిట్’ను ఏర్పాటు చేసింది. అక్రమ నిర్బంధం, కస్టడీ హింస, హత్య, ఆధారాల తారుమారు వంటి అంశాలపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై కూడా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz