ఇది ప్రజా పాలన, ఫామ్ హౌస్ పాలన కాదు బండి రమేష్ ఘాటు వ్యాఖ్యలు

0
123

బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో 

కుక్కట్పల్లి mla మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మాత్రమే అని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ గారు పేర్కొన్నారు.

 

మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి అవమానకర చర్యలు జరగడం లేదని, లబ్ధిదారులు నిజమైన వారేనని నిర్ధారించడానికి మాత్రమే ఆధార్ ధృవీకరణ, బయోమెట్రిక్ లేదా ఇతర గుర్తింపు ప్రక్రియలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పారదర్శకత, అవినీతి నివారణ, నకిలీ లబ్ధిదారులను అరికట్టడమే ఈ ప్రక్రియల ఉద్దేశమని తెలిపారు. బి ఆర్ఎస్ నాయకుల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారటం వల్ల అభద్రతాభావంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు

 

బీఆర్ఎస్ నాయకులు మహిళల గౌరవం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, పదేళ్ల పాలనలో మహిళలపై జరిగిన ఎన్నో ఘటనలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం మానుకోవాలని హితవు పలికారు. 

 

అలాగే చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్నికలతో ముడిపెట్టడం నిరాధార ఆరోపణ మాత్రమేనని, ప్రభుత్వం అర్హులైన ప్రతి మహిళకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, అలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే విచారణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

 

"సంక్షేమ కార్యక్రమాల్లో పారదర్శకతను అవమానంగా చూపించడం బీఆర్ఎస్ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు" అని *ఇది ప్రజా పాలన అని ఫామ్ హౌస్ పాలన కాదు అని బండి రమేష్ గారు పేర్కొన్నారు*.

Search
Categories
Read More
Andhra Pradesh
అనంతపురం జిల్లా పుట్లూరులో విద్యార్థులు స్కూల్ బస్ కు అగ్నిప్రమాదం పూర్తిగా దగ్ధం..!
అనంతపురం జిల్లా పుట్లూరులో విద్యార్థులు స్కూల్ బస్ కు అగ్నిప్రమాదం పూర్తిగా దగ్ధం..! పుట్లూరు...
By Eslavath RameshNaik 2026-01-28 14:02:57 0 560
Himachal Pradesh
Chandratal Lake Swamped: Spiti's Overtourism Warning
Spiti’s stunning Chandratal Lake is facing a severe crisis due to surging tourist...
By Tejaswini Komanduru 2026-06-15 05:35:10 0 213
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకుTDP అధ్యక్షులు వల్లవినేని వెంకట్రావు పాస్టర్లకు వస్త్రాల పంపిణీ
*తాడేపల్లి:*     *మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు...
By Rajini Kumari 2025-12-24 08:30:05 0 217
Andhra Pradesh
అక్రమ లేఅవుట్‌పై చర్యలు: కొనుగోలుదారులు జాగ్రత్త.
మదనపల్లె మండలం రామాచర్లపల్లెలో అనుమతులు లేకుండా సుమారు 2.85 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు...
By Pagadala Venkateswar 2026-04-09 04:36:24 0 133
Telangana
పి డి ఎస్ యూ తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను విజయవంతం చేయండి.
మహబూబాబాద్. డిసెంబర్.27 (భారత్ అవాజ్): కొత్తగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో PDSU...
By Bheeshman King 2025-12-27 12:09:34 0 311
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com