ఇది ప్రజా పాలన, ఫామ్ హౌస్ పాలన కాదు బండి రమేష్ ఘాటు వ్యాఖ్యలు

0
129

బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో 

కుక్కట్పల్లి mla మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మాత్రమే అని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ గారు పేర్కొన్నారు.

 

మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి అవమానకర చర్యలు జరగడం లేదని, లబ్ధిదారులు నిజమైన వారేనని నిర్ధారించడానికి మాత్రమే ఆధార్ ధృవీకరణ, బయోమెట్రిక్ లేదా ఇతర గుర్తింపు ప్రక్రియలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పారదర్శకత, అవినీతి నివారణ, నకిలీ లబ్ధిదారులను అరికట్టడమే ఈ ప్రక్రియల ఉద్దేశమని తెలిపారు. బి ఆర్ఎస్ నాయకుల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారటం వల్ల అభద్రతాభావంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు

 

బీఆర్ఎస్ నాయకులు మహిళల గౌరవం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, పదేళ్ల పాలనలో మహిళలపై జరిగిన ఎన్నో ఘటనలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం మానుకోవాలని హితవు పలికారు. 

 

అలాగే చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్నికలతో ముడిపెట్టడం నిరాధార ఆరోపణ మాత్రమేనని, ప్రభుత్వం అర్హులైన ప్రతి మహిళకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, అలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే విచారణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

 

"సంక్షేమ కార్యక్రమాల్లో పారదర్శకతను అవమానంగా చూపించడం బీఆర్ఎస్ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు" అని *ఇది ప్రజా పాలన అని ఫామ్ హౌస్ పాలన కాదు అని బండి రమేష్ గారు పేర్కొన్నారు*.

Search
Categories
Read More
Andhra Pradesh
పెద్దాపురం కాపు కళ్యాణమండపానికి రూ.75 లక్షలు మంజూరు – ఎంపీ ఉదయ్ శ్రీనివాస్
పెద్దాపురం పట్టణంలో గత 15 ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన కాపు కళ్యాణమండపం నిర్మాణానికి శుభవార్త...
By Ratna Sekhar 2026-02-19 19:10:42 0 1K
Business & Finance
Commercial LPG Price Cut Benefits Bengaluru Firms
Oil marketing companies have reduced commercial LPG cylinder prices in Bengaluru, offering...
By Navya Sree 2026-07-06 06:42:09 0 61
Andhra Pradesh
రొంపిచర్ల: మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
రొంపిచర్ల AP మోడల్ స్కూల్లో 2026-27లో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు...
By Kothuru Murali 2026-02-21 08:29:11 0 161
Andhra Pradesh
పుంగనూరు: ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
పుంగనూరులో శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే హజ్రత్ సయ్యద్ నూర్షావాలి బాబా దర్గా ఉరుసు ఏర్పాట్లను,...
By Kothuru Murali 2026-05-08 14:30:54 0 116
Andhra Pradesh
పుంగనూరు న్యాయవాదుల సంఘం బాధ్యతలు స్వీకరణ, న్యాయమూర్తుల నియామకంపై వినతి
అన్నమయ్య జిల్లా పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది విజయకుమార్, ప్రధాన...
By Kothuru Murali 2026-04-02 06:39:34 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com