తనిఖీలు చేస్తున్న ఆర్టీవో పై నుంచి వెళ్లిన బొగ్గు లారీ.....

0
136

అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి నెల రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వచ్చిన అధికారి

ఆర్టీవో కార్యాలయం ముందే బీభత్సం సృష్టించిన బొగ్గు లారీ...

భారత్ అవాజ్ న్యూస్: 22 జూన్ రోజున భూపాలపల్లి జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి (ఆర్టీవో) వెంకన్న రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు బొగ్గు లారీలను చెక్ చేస్తున్న క్రమంలో అతివేగంతో వచ్చిన ఒక టిప్పర్ లారీ ఆయనపై నుంచి దూసుకెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు ఆర్టీవో వెంకన్న స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు...

బదిలీపై వచ్చిన నెల రోజులకే ప్రమాదం

ఆర్టీవో వెంకన్న కేవలం నెల రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు బదిలీపై బాధ్యతలు చేపట్టడానికి వచ్చారని తోటి అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా కార్యాలయం ముందే తనిఖీలు చేపడుతుండగా ఈ ఘోర ప్రమాదం జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి కారణమైన బొగ్గు లారీ బీభత్సంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

Search
Categories
Read More
Karnataka
New Alcohol-in-Beverage Tax Structure Rolls Out
Karnataka has implemented a pioneering Alcohol-in-Beverage (AIB) excise policy, shifting taxation...
By Dunna Jessicaruth 2026-05-18 06:56:01 0 63
Andhra Pradesh
ఎస్ ఐ ఆర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయడానికి సహకరించాలి: కమిషనర్
కర్నూలు : ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతానికి సహకరించాలి కర్నూలు నియోజకవర్గ ఆర్వో, కమిషనర్...
By Hari Krishna 2026-01-06 11:39:00 0 198
Telangana
పంట నష్ట బాధితులకు బాసటగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
మెదక్ జిల్లా:  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెతుకు సీమ అతలాకుతలం అయింది.తాజాగా పాపన్నపేట్...
By Sidhu Maroju 2025-09-01 13:13:24 0 430
SURAKSHA
మహిళల భద్రతకు తెలంగాణ పోలీసుల భరోసా - షీ టీమ్స్
తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, 'షీ టీమ్స్' (SHE Teams) ద్వారా ప్రత్యేక...
By Kalaga Sailaja 2026-07-01 07:28:50 0 74
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీలో వేగవంతంగా ఫింఛన్ల పంపిణీ ..10.30 గంటల సమయానికే 60 శాతం పంపిణీ.
ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ లబ్దిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తున్న గ్రామ...
By Pagadala Venkateswar 2026-01-31 05:53:21 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com