రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ముందస్తు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించి జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు

0
67

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా రాక నేపధ్యంలో అత్యంత పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు: మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు

ఈ నెల 27వ తేదీ న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో సంజీవిని పథకం లో భాగంగా డిజిటల్ నర్వ్ సెంటర్ ప్రారంభించునున్న నేపథ్యంలో ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత, ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపియస్.,గార్లతో పాటు గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మరియు జిల్లా అధికారులు పరిశీలించారు.

హెలిప్యాడ్ ప్రదేశం, ప్రజా వేదిక, పార్కింగ్ ప్రాంతాలను, సీఎం కాన్వాయ్ రూట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు చుట్టు ఉన్న ప్రాంతములను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంకా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు వీఐపీల వాహనాల రాక, సభా స్థలంలో వేదిక, పార్కింగ్‌ ఏరియా, సీఎం ప్రవేశం, నిష్క్రమణ స్థలాలను, హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ఉన్న రూట్ ను, క్షుణ్ణంగా పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ఇతర శాఖల సమన్వయంతో అన్ని చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ గారి ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో మార్కాపురం జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం డి.ఎస్.పి యు. నాగరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ యం.శ్రీనివాసరావు, గిద్దలూరు అర్బన్ సీఐ కె. సురేష్, రూరల్ సీఐ రామకోటయ్య, కంభం సీఐ మల్లికార్జున మరియు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Business & Finance
Industrial Corridors Drive Manufacturing Growth in Madhya Pradesh
The development of industrial corridors and manufacturing clusters across Madhya Pradesh is...
By Navya Sree 2026-07-04 06:57:56 0 50
Andhra Pradesh
రాష్ట్రంలోని అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా పెద్దకడబూరు పోలీస్ స్టేషన్ : కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లాలోని పెద్ద కడబూర్ పోలీస్ స్టేషన్ రాష్ట్రం లోనే  అత్యుత్తమ...
By Hari Krishna 2026-01-09 14:16:25 0 217
Andhra Pradesh
జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య.
ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా గడియారం...
By Vadlamudi NagaVenkat 2026-04-11 09:13:59 0 150
Andhra Pradesh
చిత్తూరు: 10 వేలు పెట్టి ఎరువు కొంటే నిలువునా ముంచేశారు
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో మంగళవారం రైతులు కల్తీ ఎరువుల అమ్మకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం...
By Kothuru Murali 2026-05-26 11:38:26 0 81
Andhra Pradesh
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మంత్రి నారా లోకేష్
అంద‌రికీ నూత‌న సంవ‌త్స‌రం శుభాకాంక్ష‌లు. ఆశ‌యాల సాధ‌న‌కు...
By Rajini Kumari 2026-01-01 10:53:59 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com