కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

0
129

కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ హేమ దుర్గా భవన్ లో ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన  వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, సామాజిక న్యాయం, యువత సాధికారత కోసం రాహుల్ గాంధీ గారు చేస్తున్న కృషిని నాయకులు కొనియాడారు.

కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్ గారి అధ్యక్షతన ఏ బ్లాక్ &బి అద్యక్షులు డాక్టర్ పి నాగిరెడ్డి, తూము వేణు ఆధ్యర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, రాహుల్ గాంధీ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు.

అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మార్కెటింగ్ కమిటీ సభ్యులు, టెంపుల్ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు, మైనారిటీ నాయకులు, SC సెల్ నాయకులు, BC సెల్ నాయకులు, సేవాదళ్ నాయకులు, సోషల్ మీడియా,కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేసారు.

రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ నాయకులు ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధత స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రామసముద్రంలో వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం.
రామసముద్రం మండలం పెద్ద కురపల్లి, కురిజాల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వైసీపీ గ్రామ...
By Pagadala Venkateswar 2026-01-27 09:14:06 0 158
Andhra Pradesh
MP కేశినేని శివనాద్ కృషిని కొనియాడిన MLA లు బోండా ఉమ గద్దె రామ్మోహన్
*ప్ర‌చుర‌ణార్థం* *24-12-2025*   *గ‌తంలో ఏ ఎంపీ ఎస్.హెచ్.జి...
By Rajini Kumari 2025-12-25 10:57:47 0 411
Andhra Pradesh
* ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య*
*ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య* ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యతారాహిత్యం ఒక నిండు...
By Chennaiah Kati 2026-02-09 04:51:04 1 632
Andhra Pradesh
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జెఎసి చైర్మన్ ఏ విద్యాసాగర్
*ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.* *సమాన పనికి సమాన వేతన విధానాన్ని అమలు చేయాలి*...
By Rajini Kumari 2025-12-21 16:26:48 0 249
Andhra Pradesh
అక్రమ మద్యం కేసు: మాజీ మంత్రి జోగి రమేష్ కోర్టుకు హాజరు.
అన్నమయ్య జిల్లా ములకలచెరువు అక్రమ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము సోమవారం ఉదయం...
By Pagadala Venkateswar 2026-02-16 04:51:31 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com