ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు....దొంగలు బాబోయ్‌ దొంగలు… దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు

0
77

ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు....దొంగలు బాబోయ్‌ దొంగలు… దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు

మధ్యప్రదేశ్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా కదలికలపై ప్రకాశం, ఏలూరు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ధార్ జిల్లాకు చెందిన నిందితుల ముఠా రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో పలు ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. చీరాలలో గతంలో చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న ముఠాలతో ఈ గ్యాంగ్‌కు సంబంధాలు ఉండొచ్చన్న అనుమానంతో స్థానిక నేరస్థుల కదలికలపైనా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ చీరాల టూ టౌన్ సీఐ శశికుమార్ అనుమానితుల ఫొటోలతో పోస్టర్లను విడుదల చేశారు. పోస్టర్లలో ఉన్న వ్యక్తులు చోరీలు, దోపిడీ కేసుల్లో నిందితులని, వారి ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

పర్చూరులోనూ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పర్చూరు ఎస్‌ఐ పులి గోపి మాట్లాడుతూ, ధార్ గ్యాంగ్ కదలికలపై రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత కొనసాగుతోందని తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ముగ్గురు అనుమానితుల కదలికలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ప్రజల సహకారంతో ఈ ముఠా కదలికలను గుర్తించి నేరాలను అరికట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్టీసీ కాంప్లెక్స్లు ఆహ్లాదకరంగా ఉండాలి
పార్వతిపురం జిల్లాలో గల అన్ని ఆర్టీసీ బస్ స్టేషన్లు ఆహ్లాదకరంగా ఉండాలని, ప్రయాణికులకు అన్ని మౌలిక...
By Boiena Rajesh 2026-03-26 14:37:49 0 217
Andhra Pradesh
సుప్రసిద్ధ వీణ విద్వాంసులు సంగీత విద్వాంసులు సుందరం బాలచందర్
సుప్రసిద్ధ వీణా విద్వాంసులు, దక్షిణ భారత చలనచిత్ర దర్శకుడు, నటుడు మరియు సంగీత దర్శకుడు సుందరం...
By Rajini Kumari 2026-04-15 13:25:23 0 150
Telangana
ఎండ వాన లెక్కచేయని మున్సిపల్, జీపీ కార్మికులు
కొంమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎండను, వానను లెక్కచేయకుండా, తెల్లవారకముందే విధులకు హాజరవుతూ వీధుల...
By Chunarkar Jagadeesh 2026-06-30 07:21:30 0 183
Andhra Pradesh
అనంతపురం: ప్రమాదాల నివారణకు అవగాహన
విద్యుత్ ప్రమాదాల నివారణకు అవగాహన – రాప్తాడు, కూడేరు మరియు గార్లదిన్నె సెక్షన్ల పరిధిలో...
By Eslavath RameshNaik 2026-03-06 16:37:27 0 367
Andhra Pradesh
నేడు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
నేడు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. డోన్ మండలం కొత్తబురుజులో గ్రామ సభలో...
By Chennaiah Kati 2026-03-09 13:36:49 0 353
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com