మదనపల్లెలో ద్వారపాలకుడి విగ్రహం ధ్వంసం.

0
75

మదనపల్లె పట్టణంలోని సొసైటీ కాలనీలో ఉన్న రామాలయం మహాద్వారం వద్ద ఉన్న ద్వారపాలకుడు విజయుడి విగ్రహం ధ్వంసమైంది. బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహం ఎడమ చేతిని విరిచినట్లు గుర్తించారు. గురువారం ఉదయం పూజల కోసం వచ్చిన అర్చకుడు నరసింహాచారి ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ప్రేమ్‌నాథ్, కార్యదర్శి మురళీకృష్ణ ఘటనను పరిశీలించి స్థానిక వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ చంద్రశేఖర్ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
MLA ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలి
మహబూబాబాద్ :  బయ్యారం మండలంలో గిరిజనేతరులకు అన్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కు మెమోరండం...
By Bheeshman King 2026-07-22 12:54:06 0 137
Telangana
సింగరేణిలో “రివ్యూ మీటింగ్‌లు” పేరుతో కాలక్షేపం జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు కార్మికుల్లో తీవ్రంగా వినిపిస్తోంది.
సింగరేణిలో “రివ్యూ మీటింగ్‌లు” పేరుతో కాలక్షేపం జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు...
By Avunoori Mahesh 2026-05-15 02:46:05 0 212
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో ఖరారైన వైయస్ షర్మిల పర్యటన
కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుంగనూరు పర్యటన ఖరారైంది. ఉపాధి హామీ పరిరక్షణ...
By Kothuru Murali 2026-02-04 16:14:35 0 162
Andhra Pradesh
చంద్రబాబుది పచ్చి అవకాశవాద రాజకీయం మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం
28.12.2025. అనంతపురం.   చంద్రబాబుది పచ్చి అవకాశవాద రాజకీయం అందుకే ఫ్లెక్సీలపై ఇప్పుడు...
By Rajini Kumari 2025-12-28 09:28:20 0 164
Telangana
"డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం”.. గాంధీ వద్ద కుటుంబ సభ్యుల ఆవేదన.|
సికింద్రాబాద్ : గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి చెందిన ఘటన...
By Sidhu Maroju 2026-05-23 07:07:01 0 265
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com