యోగాంధ్ర-2026: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రిజిస్ట్రేషన్.. సీఎం సమీక్షలో కీలక ఆదేశాలు.

0
67

 

యోగాంధ్ర-2026: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రిజిస్ట్రేషన్.. సీఎం సమీక్షలో కీలక ఆదేశాలు

18-06-2026 Thu 07:42

Andhra

Yogandhra 2026 One crore registrations statewide and key orders in CM review

యోగాంధ్ర-2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

‘ఇంటింటా యోగా’ నినాదంతో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశం

జూన్ 21న జరిగే వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్లు

విజయవాడలో జరిగే ప్రధాన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం, యోగా గురు బాబా రామ్‌దేవ్

ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయింపు

అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'యోగాంధ్ర-2026' కార్యక్రమ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. 'ఇంటింటా యోగా' నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, యోగాను ప్రతి ఒక్కరి దినచర్యలో భాగంగా మార్చాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో యోగా కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ 'సంజీవని' ఆరోగ్య పథకంతో అనుసంధానం చేయాలని ఆయన సూచించారు.

 

యోగాను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేసేందుకు ఏడాది కాలానికి సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారి కోసం ప్రత్యేకంగా 'థెరప్యూటిక్ యోగా' సెషన్లు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. 'యోగాంధ్ర-2026' కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే కోటి మందికి పైగా ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 

రాష్ట్రస్థాయి ప్రధాన వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో సుమారు 5,000 నుండి 6,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ వర్షం కురిస్తే ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ కళావేదికలో వెయ్యి మందితో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు యోగా గురు బాబా రామ్‌దేవ్ కూడా పాల్గొననున్నారు. 'యోగాంధ్ర-2026' నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 10 కోట్లు కేటాయించింది.

 

యోగా గురు బాబా రామ్‌దేవ్ జూన్ 19న రాష్ట్రానికి చేరుకోనున్నారు. జూన్ 20న ఉండవల్లిలో ముఖ్యమంత్రితో కలిసి ఆయన ప్రత్యేక యోగా సెషన్‌లో పాల్గొంటారు. వచ్చే ఏడాది యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన యోగా మాస్టర్ ట్రైనర్లకు ప్రత్యేక అవార్డులు అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే, 'యోగా యాజ్ డెస్టినేషన్' క్యాలెండర్‌ను కూడా జూన్ 21న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ చక్రధరబాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.       

Search
Categories
Read More
Andhra Pradesh
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు.
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు 02-02-2026...
By Pagadala Venkateswar 2026-02-02 09:56:32 0 144
Chhattisgarh
Chhattisgarh Strengthens Forest and Biodiversity Protection
Chhattisgarh continues to enhance forest conservation and biodiversity protection through...
By Fathima Safa 2026-07-03 15:13:26 0 60
Andhra Pradesh
ఉపాధి హామీ వేతనదారుడు మృతి
గంట్యాడ మండలం కొత్త వెలగాడలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువు పనిలో చౌడువాడ కన్నయ్య తాత అనే...
By Boiena Rajesh 2026-04-22 00:35:31 0 199
Andhra Pradesh
వి ఆర్ ఏ లకు పదోన్నతులు ఇవ్వా లి
ఈరోజు 11 గంటలకు విశాఖ ఉమ్మడి జిల్లా గ్రామ సేవకులు (విఆర్ ఏ) సంఘం ప్రతినిధులు జిల్లా సమన్వయ కర్త...
By Mobbu Venkatramana 2026-02-07 08:30:54 0 411
Andhra Pradesh
పుంగనూరు:బోయకొండ గంగమ్మను దర్శించుకున్న పోలీసు ఉన్నతాధికారులు.
శుక్రవారం, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయాన్ని అన్నమయ్య జిల్లా డి ఐ జి...
By Kothuru Murali 2026-01-30 11:43:10 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com