పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలతో మంత్రి లోకేష్ భేటీ

0
71

పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలతో మంత్రి లోకేష్ భేటీ

పార్టీ బలోపేతంపై చర్చ

మంగళగిరి: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కార్వనిర్వాహక అధ్యక్షులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్(సర్) ప్రక్రియపై మంత్రి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపైనా సమావేశంలో చర్చించారు. త్వరలోనే పార్టీ సంస్థాగత కమిటీలను పూర్తిచేస్తామని చెప్పారు. కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల ఎత్తివేతకు చర్యలు చేపడతామన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరంగా తలెత్తుతున్న సమస్యలను ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. జోనల్ ఇంఛార్జ్, నియోజకవర్గ పరిశీలకులను పంపి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పెద్దాపురం: సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలు
పెద్దాపురం పట్టణానికి చెందిన గృహిణి కొరుకొండ మహాలక్ష్మి సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలను తయారు చేసి...
By Ratna Sekhar 2026-02-12 08:22:04 0 349
Andhra Pradesh
నిమ్మనపల్లి: ఆస్తిలో వాటా అడిగిన అక్కపై తమ్ముడు కర్రతో దాడి.
ఆస్తిలో వాటా అడిగినందుకు అక్కపై తమ్ముడు కర్రతో దాడి చేసిన ఘటన బుధవారం నిమ్మనపల్లిలో చోటు...
By Pagadala Venkateswar 2026-01-29 07:44:54 0 161
SURAKSHA
Shri Binod Kumar, IPS: A Leader Shaping Modern Police Excellence
A 1997-batch AGMUT cadre IPS officer whose commitment to professional policing, organizational...
By Kalaga Sailaja 2026-07-23 10:40:51 0 25
Andhra Pradesh
#petrol yuddam
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో పెట్రోల్ యుద్దం వాహనదారులు ఇబ్బందులు
By Kokkiligadda Suresh 2026-04-27 08:24:08 0 559
Chhattisgarh
Chhattisgarh Mandates State-Wide Fire Safety Audits
In response to a devastating commercial fire incident in Lucknow, Chhattisgarh Chief Minister...
By Lokeshwari Panthadi 2026-06-26 11:58:40 0 65
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com