ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్.

0
68

ఏపీలో క్రీడాభివృద్ధిపై జాంటీ రోడ్స్‌తో లోకేశ్ చర్చ

క్రీడలు, యువత అభివృద్ధిపై ఇరువురి మధ్య సమాలోచనలు 

ప్రపంచస్థాయి క్రీడా వ్యవస్థను నిర్మిస్తామన్న లోకేశ్

అంతర్జాతీయ పద్ధతులతో క్రీడాకారులను ప్రోత్సహిస్తామని వెల్లడి

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

 

ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధి, క్రీడల్లో అత్యుత్తమ సంస్కృతిని నెలకొల్పడం వంటి అంశాలపై తామిద్దరం ఆసక్తికరంగా చర్చించుకున్నామని లోకేశ్ తెలిపారు. ప్రపంచస్థాయి క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

 

అంతర్జాతీయంగా అనుసరిస్తున్న అత్యుత్తమ పద్ధతులను అందిపుచ్చుకుని, భవిష్యత్ ఛాంపియన్‌లను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తామని మంత్రి లోకేశ్ వివరించారు. రాష్ట్రంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించి, ప్రతిభావంతులైన యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

 

ఈ భేటీ సందర్భంగా జాంటీ రోడ్స్ తాను సంతకం చేసిన బ్యాట్ ను లోకేశ్ కు బహూకరించారు. అటు, లోకేశ్ కూడా తన యువగళం పాదయాత్ర విశేషాల పుస్తకాన్ని రోడ్స్ కు అందించారు.

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్‌లో ఘనంగా 'ఇందిరా మహిళా శక్తి' చీరల పంపిణీ
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్): ఆసిఫాబాద్, మే 25:...
By Chunarkar Jagadeesh 2026-05-25 10:34:10 0 452
Telangana
ఘనంగా భాగ్యలక్ష్మి పౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు.ఈ సందర్భంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకుల పంపిణీ.
జగద్గిరిగుట్ట: భాగ్యలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు బుధవారం...
By Sidhu Maroju 2025-06-19 13:43:28 0 1K
Andhra Pradesh
పుంగనూరు: కల్తీ ఎరువులతో రైతుల ధర్నా
అన్నమయ్య జిల్లా, సోమల మండల కేంద్రంలో మంగళవారం పలువురు రైతులు ధర్నా నిర్వహించారు. టమాటా సాగు కోసం...
By Kothuru Murali 2026-05-26 11:35:24 0 72
Andhra Pradesh
పుంగనూరులో మానవత్వం చాటుకున్న ప్రజలు
పుంగనూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గురువారం రాత్రి రోడ్డుపై వెళ్తున్న ఆవును గుర్తు తెలియని...
By Kothuru Murali 2026-05-01 12:15:54 0 95
Telangana
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క. జోడేఘాట్‌లో అమరవీరుడు కొమురం భీం విగ్రహానికి ఘన నివాళులు. పలు గ్రామాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సర్‌ SSR ప్రక్రియపై క్షేత్రస్థాయి సమీక్ష.
కుమురంభీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: జల్-జంగల్-జమీన్ హక్కుల కోసం పోరాడి...
By Chunarkar Jagadeesh 2026-07-21 15:06:36 0 69
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com