ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి అండగా వైయస్ జగన్

0
190

ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి అండగా వైయస్ జగన్

 

- తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం

- కూటమి ప్రభుత్వంలో వ్యాపారులు, ఆర్యవైశ్యులపై వేధింపులు పెరిగాయి 

- ఆర్య‌వైశ్యులంతా ఒక‌తాటిపైకి రావాలి

- టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంలో ఆర్య‌వైశ్యులు భాగ‌స్వాములు కావాలి

- సజ్జల రామ‌కృష్ణారెడ్డి పిలుపు

 

- ఆర్యవైశ్యులకు వైయస్సార్‌సీపీ జెండా అండ‌ : సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్‌

చంద్ర‌బాబు కూటమి ప్రభుత్వం ఏర్ప‌డిన‌ప్పటి నుంచి అన్ని వర్గాలపై వేధింపులే లక్ష్యంగా పనిచేస్తోంది. వైయస్‌ జగన్‌ హయాంలో మాత్రం కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అందరికీ సమాన న్యాయం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో వారి సమస్యలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా డిజిటల్‌ బుక్‌ను ఏర్పాటు చేశాం. ప్రత్యర్థులపై మొదలైన వేధింపులు ఇప్పుడు సామాన్య ప్రజల వరకు చేరాయి. అయినప్పటికీ వైయస్సార్‌సీపీ శ్రేణులకు ధైర్యం, భరోసా, అండగా వైయస్‌ జగన్‌ నిలుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు శాశ్వతం కావు. ప్రజలకు మళ్లీ మంచి రోజులు వస్తాయి.

 

ఆర్యవైశ్యులు శాంతియుత వాతావరణాన్ని కోరుకునే వర్గం. తమ కష్టంతో ఎదిగే వారికి ప్రభుత్వం భద్రత, ప్రశాంతత కల్పించాలి. కానీ గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అవినీతి, దోపిడీ పెరిగిపోగా, ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన మేలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో ఆర్యవైశ్యులు ముందుండాలి. వారి సమస్యల పరిష్కారానికి వైయస్సార్‌సీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కృషి చేస్తుంది.

 

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఆర్యవైశ్యులను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తున్నాం. ఇప్పటికే వేలాది మంది ఆర్యవైశ్యులు వివిధ కమిటీల్లో బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, మహిళలు కూడా చురుకుగా పాల్గొంటున్నారు. వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించేందుకు వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారు. ఆర్యవైశ్యులు తమ బలాన్ని సంఘటితం చేసుకుని సమాజంలో, రాజకీయాల్లో మరింత ప్రభావవంతమైన పాత్ర పోషించాలి అని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కోత్త గా తిరుపతి జిల్లా ఇలా వుండ పోతుంది.
తిరుపతి: డివిజన్లు: మూడు 1.తిరుపతి,2.శ్రీ కళాహస్త్రి,3.సూళ్లూరు పేట మండలాలు:-36...
By Karapati Gopi 2025-12-30 02:47:38 0 347
Dadra &Nager Haveli, Daman &Diu
Dadra and Nagar Haveli Strengthens Disaster Management
Dadra & Nagar Haveli and Daman & Diu continue to strengthen disaster management through...
By Fathima Safa 2026-07-02 07:39:35 0 71
Andhra Pradesh
మదనపల్లి: వేధింపుల కేసులో ఎనిమిది మందిపై కేసు నమోదు.
మదనపల్లెలో ఓ మహిళ తన అత్తింటివారు వేధింపులకు గురిచేస్తున్నారని, భర్త మరో వివాహానికి...
By Pagadala Venkateswar 2026-04-10 05:47:37 0 106
Jharkhand
Digital Health Boost: State Hospitals to Get Fully Auto-Labs
The Jharkhand Health Department is taking a giant leap toward modernization. Additional Chief...
By Dunna Jessicaruth 2026-05-15 09:55:43 0 83
Andhra Pradesh
రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని జనసేన నాయకుడి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.
మదనపల్లెలో శ్రీరామనవమి పండగ సందర్భంగా, ప్రముఖ సినీ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరగా...
By Pagadala Venkateswar 2026-03-28 04:18:43 1 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com