"రామ్‌నగర్ వాసులకు ఊరటనిచ్చిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
115

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలోని రామ్‌నగర్ ప్రాంతంలో బోర్‌వెల్ పనిచేయక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. 

స్థానిక నివాసితుల ఫిర్యాదు అందుకున్న వెంటనే ఆమె స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి, స్వచ్ఛంద సహకారంతో బోర్‌వెల్‌ను మరమ్మతు చేయించి తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చారు. 

దీంతో కాలనీవాసులకు తాగునీటి సరఫరా పునరుద్ధరించబడింది.

ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రాంతంలో నెలకొన్న పలు మౌలిక వసతుల సమస్యలు, పౌర అవసరాలకు సంబంధించిన అంశాలను నివాసితులు ఆమె దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బోర్‌వెల్ మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయించి తాగునీటి సమస్యను పరిష్కరించినందుకు స్థానికులు శాంతి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె ఎప్పటికప్పుడు ముందుండి స్పందిస్తూ, కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రేమ్, అరుణ్, లింగారెడ్డి, మహేందర్, జార్జ్ తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం
ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన చుండూరి...
By Gadiyapudi Narendra 2025-12-30 17:07:05 0 256
Business & Finance
What Is a Nidhi Company and Why Does It Matter?
A Nidhi Company is a type of non-banking financial company (NBFC) formed to encourage savings...
By Navya Sree 2026-07-18 05:29:08 0 32
Telangana
ఫాదర్ బాలయ్య నగర్ ల్లో కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా :అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్‌లో ఉన్న...
By Sidhu Maroju 2025-08-21 15:47:41 0 629
Andhra Pradesh
రేల ఉత్సవం 24,25,26న ఛలో రంపచోడవరం
చింతూరు మండలం అల్లిగూడెం గ్రామం లో మన సంస్కృతి మన ఆస్తిత్వం ఆదివాసి సాంప్రదాయ కళ వైభావాన్ని చాటి...
By Shyamala Yadagiri 2026-05-13 03:34:09 0 212
Andhra Pradesh
నూరు నియోజకవర్గ :సదుంలో పర్యటించిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే
పుంగనూరు నియోజకవర్గం, సదుం లో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుక్రవారం...
By Kothuru Murali 2026-03-21 06:20:14 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com