ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది: పవన్‌ కల్యాణ్‌.

0
90

 

 

ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది: పవన్‌ కల్యాణ్‌

12-06-2026 Fri 14:54

Andhra

Pawan Kalyan says people verdict changed history and coalition committed to AP reconstruction

ప్రజాస్వామ్యంలో తుది నిర్ణేతలు ప్రజలేనన్న పవన్‌

రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ఏర్పడిందని స్పష్టీకరణ

ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్నామని వ్యాఖ్య

ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పునకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

 

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడులో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి, సంక్షేమం’ బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చారిత్రక విజయానికి కారణమైన ప్రజలకు, కూటమి శ్రేణులకు పవన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

 

‘‘రెండేళ్ల క్రితం ప్రజలు మాకు కేవలం అధికారాన్ని ఇవ్వలేదు.. ఒక పెద్ద బాధ్యతను అప్పగించారు. అహంకారం, విధ్వంసక రాజకీయాలపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమే 2024 ఎన్నికల ఫలితం. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం కూటమి ఏర్పడింది. అధికారాన్ని పంచుకోవడం కోసం కాదు.. బాధ్యతను పంచుకోవడం కోసం ఈ కూటమి ముందుకొచ్చింది’’ అని పవన్‌ అన్నారు. జనసేన కేవలం 21 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, ప్రజల ఆశీర్వాదంతో అన్ని స్థానాల్లో విజయం సాధించడం తమపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

 

ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్‌ స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధికి కీలకమైన పంచాయతీరాజ్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే ఎన్‌డీయే ప్రభుత్వ సమష్టి కృషి వల్ల విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోగలిగామని తెలిపారు. దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

 

ఇటీవల జరిగిన విశాఖ స్టీల్‌ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని పవన్‌ పేర్కొన్నారు. ఆ దుర్ఘటన కారణంగానే ఈ నెల 9న జరగాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేసి ఇప్పుడు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: నేడు విద్యార్థులకు అవగాహన సదస్సు.
యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కల్పించేందుకు గురువారం సర్వోదయ డి...
By Pagadala Venkateswar 2026-02-12 04:43:02 0 157
Telangana
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వల్ల 12 గ్రామల ప్రజలు దుర్వాసన, శ్వాసకోశ ఇబ్బందులు మరియు చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు.
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ గురించి ప్రస్తుతం ఉన్న డంపింగ్...
By Thalakayala Nagashiva 2026-04-12 07:17:29 0 290
Telangana
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డౌన్ పాల్ .|
హైదరాబాద్ : 2024తో పోలిస్తే 25లో 2 శాతం తగ్గిన ఇళ్లు, ప్లాట్ల అమ్మకాలు. మరోవైపు దేశంలోని ప్రధాన...
By Sidhu Maroju 2026-01-05 09:37:05 0 201
West Bengal
West Bengal Advances Urban Development and Smart Cities
West Bengal is accelerating urban development through Smart Cities Mission projects, improved...
By Fathima Safa 2026-07-02 05:22:10 0 40
Andhra Pradesh
రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు
*తే.18.12.2025 దీన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన...
By Rajini Kumari 2025-12-18 07:53:21 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com