ఇప్పటికైనా కళ్లు తెరవండి, మీ పాలనను అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారన్న విషయాన్ని గుర్తించండి.హరీష్ రావు తన్నిరు

0
130

మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న 

‎ రేవంత్ రెడ్డి .. ముందు అంగన్ వాడీలకు జీతాలు చెల్లించి, మహిళల పట్ల నీకున్న గౌరవాన్ని నిలబెట్టుకో. 

‎రెండు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62వేల అంగన్ వాడీ సోదరీమణుల కష్టాలు మీకు కనిపించడం లేదా?

‎నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అంగన్ వాడీలను వేదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా వారి ఉసురు తగులుంది.    

‎మహిళా మంత్రిగా ఉన్న సీతక్క గారు సాటి మహిళల కన్నీటి గోస అర్థం చేసుకోకపోవడం శోచనీయం. 

‎అంగన్ వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ గారు వారు వర్కర్లు కాదని, అంగన్ వాడీ టీచర్లు అని పోస్టును ఉన్నతీకరించారు. వారి గౌరవాన్ని పెంచారు.

‎2014 నాటికి అంగన్ వాడీ టీచర్లకు కేవలం రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేది. 

‎కానీ బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అంగ‌న్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.13,650లకు, మినీ అంగన్ వాడీ టీచర్ల వేతనాన్నిరూ.7,800లకు, అంగన్ వాడీ హెల్పర్ల వేతనాన్ని రూ.7,800 లకు పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించారు. 

‎అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని 18,000లకు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారు.

‎మాయ మాటలు చెప్పి, రెండున్నరేండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అతీ లేదు, గతీ లేదు.

‎ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం, అధికారంలోకి వచ్చాక అబద్దాలు ప్రచారం చేసుకుంటం అన్నట్లుంది కాంగ్రెస్ వైఖరి. 

‎సమస్యల పరిష్కారం కోసం ఛలో సెక్రెటేరియట్ పిలుపునిచ్చిన అంగన్ వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, కర్కషంగా వ్యవహరించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. 

‎ఇప్పటికైనా కళ్లు తెరవండి, మీ పాలనను అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారన్న విషయాన్ని గుర్తించండి.

‎రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్న అంగన్ వాడీల వేతనాలను చెల్లించాలని, అప్ గ్రేడ్ చేసిన మినీ అంగన్ వాడీలకు ఏడాదిగా పెండింగ్ లో ఉన్న పెంచిన వేతనాలను తక్షణం చెల్లించాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

Search
Categories
Read More
Andhra Pradesh
LV Subrahmanyam: శ్రీవారి నెయ్యి కోసం సొంత వ్యవస్థ ఉండాలి: ఎల్వీ సుబ్రహ్మణ్యం.
అమూల్ నమూనాలో రైతుల నుంచి పాలు సేకరించాలని ఎల్వీ సూచన  గత ప్రభుత్వంలో జరిగింది క్షమించరాని...
By Pagadala Venkateswar 2026-02-07 07:30:05 0 152
Telangana
250 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన hydra
-రూ. 250 కోట్ల విలువైన భూమిని కాపాడిన‌ హైడ్రా -2.34 ఎక‌రాల ప్ర‌భుత్వ బూమి చుట్టూ...
By Nagula Swamy 2026-03-16 10:24:14 0 432
Andhra Pradesh
ప్రపంచ వ్యాప్తంగా మెటా సేవల్లో అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా మెటా సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,...
By SivaNagendra Annapareddy 2026-06-12 14:48:56 0 230
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల...
By Kothuru Murali 2026-02-28 13:04:47 0 130
Andhra Pradesh
చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజ దర్బార్ నిర్వహించిన కలెక్టర్ గారు
ఈరోజు చిత్తూరు కలెక్టర్  ఆఫీసులో కలెక్టర్ గారు ప్రజాదర్బార్ నిర్వహించారు ఇందులో ప్రజలు ...
By Kothuru Murali 2025-12-29 14:22:43 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com