బాలాజీ నగర్లో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బండి రమేష్ పాదయాత్ర
కూకట్పల్లి బాలాజీ నగర్ డివిజన్ లొ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ బాలాజీ నగర్ డివిజన్లో విస్తృత పాదయాత్ర నిర్వహించారు.
కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ ఈ పాదయాత్రకు నాయకత్వం వహించారు. కాలనీవాసులు, మహిళలు, అసోసియేషన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బాలాజీ నగర్లో నెలకొన్న డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల దుస్థితి, ట్రాఫిక్ ఇబ్బందులు, మౌలిక వసతుల కొరత వంటి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ బండి రమేష్ పాదయాత్ర నిర్వహించారు. ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి సమస్యలను నమోదు చేసుకున్నారు.
ఈరోజు నిర్వహించిన ఈ పాదయాత్రలో బండి రమేష్ ప్రతి గల్లీ, ప్రతి వీధిని సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
కుకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ డివిజన్ పరిధిలో ఈ కార్యక్రమం జరిగింది.
కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.
పాదయాత్ర సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడిన బండి రమేష్ వారి ఫిర్యాదులను స్వీకరించారు. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల పరిస్థితి, అపోలో ఫార్మసీ ఎదురుగా ఉన్న రహదారి విస్తరణ అంశాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదేళ్లుగా భారీ అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్నప్పటికీ కాలనీల్లో ఇంకా మౌలిక సమస్యలు కొనసాగుతుండటంపై ప్రశ్నించారు. అపోలో ఫార్మసీ ఎదురుగా ఉన్న రోడ్డును కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 40 అడుగుల రహదారిగా మంజూరు చేసి, సుమారు రూ.1 కోటి నిధులు కేటాయించిందని తెలిపారు.
ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అధికారులతో చర్చించి అందరికీ అనుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డ్రైనేజ్ వ్యవస్థ పునరుద్ధరణ, రోడ్ల అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించేలా కృషి చేస్తామని వెల్లడించారు.
అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం సాధిస్తానని బండి రమేష్ స్పష్టం చేశారు. "నేను మళ్లీ పాదయాత్రకు వచ్చే సమయానికి బాలాజీ నగర్లో ఒక్క సమస్య కూడా మిగలకుండా చూడాలి" అని అధికారులకు, ప్రజలకు సూచించారు.
పాదయాత్ర విజయవంతం కావడానికి సహకరించిన కాలనీవాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు బండి రమేష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz